calender_icon.png 21 June, 2025 | 7:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆత్మగౌరవానికి ప్రతీక సొంత ఇల్లు

05-06-2025 01:02:02 AM

నిరుపేదల చిరకాల స్వప్నం సాకారం దిశగా ఇందిరమ్మ ఇండ్లు

 సిరిసిల్ల, జూన్ 4(విజయక్రాంతి): పేదవారి ఆత్మగౌరవానికి  ప్రతీక సొంత ఇల్లు ఈ చిరకాల స్వప్నం సాకారం దిశగా ప్రజా ప్రభుత్వం  సహకారంతో అడుగులు వేగంగా పడుతున్నాయి. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు శరవేగంగా ముందుకు సాగుతున్నాయి. లబ్దిదారులకు ఇసుక ఉచితంగా అందిస్తోంది ప్రభుత్వం.

మొదటి దఫాలో ఇండ్లు పూర్తి చేసుకుంటున్న వారి బ్యాంకు ఖాతాల్లో రూ. కోటికి పైగా మంజూరు చేసి రాష్ట్ర ప్ర భుత్వం భరోసాగా నిలుస్తున్నది.ఇండ్ల మంజూరు పత్రాల జారీలో రాష్ట్రంలో రాజన్న సిరిసిల్ల జిల్లా మొదటి స్థానంలో నిలిచింది.మొదటి విడుతలో ఇంటి స్థలాలు ఉన్న వారికి రూ. ఐదు లక్షల ఆర్థిక సహాయాన్ని నాలుగు దశల్లో అందజేస్తున్నది. 400 చదరపు అడుగుల నుంచి 600 చదరపు అడు గులలోపు ఇంటి నిర్మాణం చేసుకోవాల్సి ఉంటుంది.ఇందిర మ్మ ఇంటి నిర్మాణంలో ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుంది.

నిర్మాణానికి అవసరమైన ఇసుక అందుబాటులో పెట్టి ఉచితంగా అందిస్తుంది.రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉ త్తర్వులు జారీ చేసింది. ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారులకు ఇండ్ల నిర్మాణం, గదులు తదితర అంశాలపై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ముందుగా జిల్లాలోని ఆయా చోట్ల మోడల్ హౌస్ లు నిర్మించాలని ఆదేశాలు జారీ చేసింది.జిల్లాలోని 11 మండలాల్లో మోడల్ నిర్మాణాలను మొదలు పెట్టా రు గృహ నిర్మాణ శాఖా అధికారులు. ఆయా ఇండ్లు తుది దశకు చేరుకున్నాయి.

జిల్లాకు మొదటి విడుత కింద 1061 ఇం డ్లు గ్రౌండింగ్ పూర్తి అయింది. వీటిలో బేస్మెట్ లెవెల్ లో 105, రూఫ్ లెవెల్ లో 31లో ఉన్నాయి. ఇందిరమ్మ ఇండ్లు నిర్మించు కుంటున్న లబ్దిదారుల బ్యాంక్ ఖాతాల్లో ప్రభుత్వం ఆర్ధిక సాయాన్ని ఎవరి ప్రమేయం లేకుండా జమ చేసింది. ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాల జారీలో రాజన్న సిరిసిల్ల జిల్లాను ప్రథమ స్థానంలో నిలిచింది.

  జిల్లాకు మంజూరు అ యిన 7862 ఇండ్లకు గాను 7828 అలాట్మెంట్ ఆర్డర్లు లబ్దిదారులకు అందజేశారు. వేములవాడ నియోజకవర్గంలో ఫేజ్ -1,2 లో కలిపి 2575 ఇండ్లు, సిరిసిల్ల నియోజకవర్గంలో ఫేజ్-1,2 లో కలిపి 3608 ఇండ్లు, చొప్పదండి నియోజకవర్గంలోని బోయినపల్లి మండలంలో ఫేజ్-1,2 లో కలిపి 820 ఇండ్లు ప్ర భుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, మేడిపల్లి సత్యంతో కలిసి, మానకొండూర్ నియోజకవర్గంలోని ఇల్లంతకుంట మండలంలో ఫేజ్-1,2లో 805 ఇండ్ల మంజూరు పత్రాలు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణతో కలిసి కలెక్టర్ పంపిణీ చేశారు. 

పైరవీ అవసరం లేదు: సందీప్ కుమార్ ఝా,

జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల కోసం ఎవరి పైరవీ అవసరం లేదు. నాలుగు దశల్లో లబ్దిదారుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా ఆర్థిక సహాయం జమవుతుంది. వీటి కోసం ఎవరినీ సంప్రదించవద్దు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణదారులకు పూర్తి సహకారం అందిస్తాము. ఇంటి నిర్మాణాలు త్వరగా పూర్తిచేసుకుని రానున్న దసరా దీపావళి పండు గలను నూతన గృహాలలో జరుపుకోవాలని లబ్ధిదారులను కోరుతున్నాను.

ప్రభుత్వ సాయాన్ని సద్వినియోగం చేసుకోవాలి

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణదారులకు రాష్ట్ర ప్రభుత్వం అందించే ఈ ఆర్థిక సాయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. సొంత ఇంటి కలను సాకారం చేసుకోవాలి. గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఇటీవల పర్యటనలో జిల్లాకు అదనంగా 1750 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశారు. దీంతో మరింత మందికి ఇందిరమ్మ ఇండ్లు కట్టుకునే అవకాశం వచ్చింది.

ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్