calender_icon.png 21 June, 2025 | 11:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డివిజన్ల పునర్విభజన శాస్త్రీయబద్ధంగా జరగలేదు

05-06-2025 01:04:43 AM

- బీఆర్‌ఎస్ నగర అధ్యక్షుడు చల్లా హరిశంకర్

కరీంనగర్, జూన్ 4 (విజయ క్రాంతి): కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో డివిజన్ల పునర్విభజన శాస్త్రీయ బద్దంగా జరగలేదని బీఆర్‌ఎస్ నగర అధ్యక్షుడు చల్లా హరిశంకర్ అ న్నారు. బుధవారం ఆయన కరీంనగర్లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మున్సిపల్ అధికారులు 60 డివిజన్లను 66 డివిజన్లుగా  శాస్త్రీయత లేకుండా ముసాయిదా తయారు చేశారని అన్నారు.  ఇందుకోసం టౌన్ ప్లానింగ్... రెవెన్యూ అధికారులు... చివరకు ఐఏఎస్ అధికారులను సైతం తప్పుదారి పట్టించారని అన్నారు. 

దీని వెనుక ఎవరున్నారో అధికారులు చెప్పాలని డిమాండ్ చేశారు. డివిజన్ లలో లేని ఓట్లను కలిపి... ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నారని,  సాంకేతికత ఎంత పెరిగినా... బౌండరీస్ సరిగ్గా ఏర్పాటు చేయలేదన్నారు. దీని పై కేంద్రమంత్రి బండి సంజయ్... రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ లు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అధికారులు తయారుచేసిన తప్పుడు ముసాయిదా జాబితా పై ఐఏఎస్ అధికారులు గుడ్డిగా ఎలా సంతకం చేశారో అర్థం కావడం లేదన్నారు. ముసాయిదా జాబితాలో పారదర్శకత కొరవడిందన్నారు.

వంద ఫీట్ల రోడ్డు, 60 ఫీట్ల రోడ్లు హద్దులుగా డివిజన్ లను విభజించాలి... కానీ ఎక్కడా ఫాలో అయినట్టు కనిపించడం లేదన్నారు. కాంగ్రెస్ బిజెపిలకు ఓటమి భయం పట్టుకుందన్నారు. బిఆర్‌ఎస్ పాలనలో కరీంనగర్ గొప్ప నగరంగా అభివృద్ధి చెందిందన్నారు. 2020 మున్సిపల్ ఎన్నికల్లో బిజెపి 13 గెలిస్తే... కాంగ్రెస్ సున్నా స్థానాలకు పరిమితమైందని, రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ కు సున్నా... బిజెపి సింగిల్ డిజిట్ కే పరిమితమవుతుందన్నారు.

ఇచ్చిన హామీలు అమలు చేయాలేని ఘనత కాంగ్రెస్ దాని, శాస్త్రీయంగా ఉన్న డివిజన్లను ఎందుకు డిస్టర్బ్ చేశారని అన్నారు. తప్పుడు ముసాయిదాపై కలెక్టర్ ని కలిసి అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతామని, స్పందన లేకపోతే కోర్టును ఆశ్రయిస్తామన్నారు.  ఈ ఎన్నికల్లో బల్దీయాపై ఎగిరేది బిఆర్‌ఎస్ జెండానేనని, 45 పైగా సీట్లను గెలుచుకుంటామన్నారు.

ఈ సమావేశంలో మాజీ కార్పొరేటర్లు కంసాల శ్రీనివాస్, సుధాగోని  మాధవి కృష్ణ, ఏదుల రాజశేఖర్, నాంపల్లి శ్రీనివాస్, నక్క పద్మ కృష్ణ, సదానంద చారి, బిఆర్‌ఎస్ పార్టీ నగర ప్రధాన కార్యదర్శి గడ్డం ప్రశాంత్ రెడ్డి, బిఆర్‌ఎస్ పార్టీ డివిజన్ ల అధ్యక్షులు చేతి చంద్రశేఖర్, ఆరె రవి గౌడ్, కొత్త అనిల్, జెల్లోజి శ్రీనివాస్, కర్రె అనిల్, దుడ్డేల ప్రశాంత్, ఈసారి జశ్వంత్, గూడెల్లి రాజకుమార్, జగన్, ఇర్ఫాన్, మేచినేని పవన్, మాజీ వైస్ ఎంపీపీ తిరుపతి నాయక్, మాజీ సర్పంచులు ఊరడి మల్లారెడ్డి, సంపత్ రావు, సత్తినేని శ్రీనివాస్, ఒడ్నాల రాజు, నాగుల కిరణ్, అనుమండ్ల ఉమా శంకర్, తదితరులుపాల్గొన్నారు.