27 April, 2026 | 2:46 PM

గాంధీ భవన్‌లో ముగిసిన పీఏసీ సమావేశం

04-07-2025 02:17 PM

హైదరాబాద్: గాంధీభవన్ లో పీఏసీ సమావేశం ముగిసింది. పీఏసీ భేటీకి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే(AICC President Mallikarjun Kharge) ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. పీఏసీ సమావేశంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీవేణుగోపాల్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మీనాక్షి నటరాజన్, మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. పాశమైలారం సిగాచీ పరిశ్రమ ప్రమాదంపై పీఏసీ సంతాపం తెలిపింది. బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణకు చేపట్టిన చర్యలపై పీఏసీ భేటీలో చర్చించారు. పార్టీ సంస్థాగత నిర్మాణం, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, స్థానిక ఎన్నికలపై చర్చించారు.