30 June, 2026 | 8:38 PM

Breaking News

రైతు భరోసా నిధుల విడుదల లైవ్ స్ట్రీమింగ్   •   వీధి వ్యాపారుల ఆర్థిక స్వావలంబనే ప్రభుత్వ లక్ష్యం   •   క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామికి ఆకు పూజ   •   కబడ్డీ క్లబ్‌లు ప్రతిభావంతులైన క్రీడాకారులను తీర్చిదిద్దాలి   •   నేరాల నియంత్రణ, విజిబుల్ పోలీసింగ్‌పై ప్రత్యేక దృష్టి   •   ఉమ్మడి జిల్లా తెలంగాణ ఉద్యమకారుల సంఘం ఇన్‌చార్జిగా పస్క నర్సయ్య నియామకం   •   ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య   •   రోడ్డు ప్రమాదాల నివారణకు 3 డి రేడియం పోలీస్ వాహనాల ఏర్పాటు   •   రిటైర్డ్ పోలీసుల సేవలు మరువలేం   •   సింగరేణి అధికారుల పీఆర్పీ నిలుపుదలను వెంటనే ఎత్తివేయాలి: జనక్ ప్రసాద్ సంఘీభావం   •  

అకాల వర్షానికి తడిసిన వరి ధాన్యం

13-04-2025 05:55 PM

తరిగొప్పుల,(విజయక్రాంతి): మండలంలోనీ అబ్దుల్ నాగారం,బోత్తలపర్రే , బొంత గట్టు నాగారం , ఆదివారం కురిసిన అకాల వర్షానికి కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన వడ్ల ధాన్యం తడిసింది. ఆరుగాల కష్టాన్ని కాపాడుకోవడానికి రైతులు అష్టకష్టాలు పడ్డారు. ఐకెపి సెంటర్లలో రైతులు ఆరబోసిన ధాన్యం వర్షానికి కొట్టుకపోయింది. కళ్లెదుటే ధాన్యం వర్షపు నీటిలో కొట్టుకపోవడంతో రైతులు చేసేదేమిలేక లబోదిబోమన్నారు. కొంతమంది రైతులు ముందస్తుగా అప్రమత్తమై టార్పాలిన్ కవర్లను ధాన్యంపై కప్పి కాపాడుకోగా మరికొంత మంది రైతులు సమయానికి ధాన్యం రాశుల వద్దకు చేరుకోక పోవడంతో వరి ధాన్యం తడిసి ముద్దైంది. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసి ఆదుకోవాలని పలువురు రైతులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.