01-06-2025 06:36:22 PM
హైదరాబాద్: ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు, పద్మశ్రీ పురస్కార గ్రహీత మంద కృష్ణ మాదిగ ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని జూబ్లీహిల్స్ నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా దేశ అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన పద్మశ్రీ అందుకున్నారు. ఈ నేపథ్యంలో మంద కృష్ణ తమ ఆనందాన్ని ముఖ్యమంత్రితో పంచుకున్నారు. అనంతరం రేవంత్ రెడ్డి ఆయనను శాలువాతో సత్కరించి, జ్ఞాపికను అందజేసి ప్రత్యేకంగా అభినందించారు. సామాజిక న్యాయం కోసం మంద కృష్ణ మాదిగ చేస్తున్న కృషిని సీఎం రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా మరోసారి ప్రశంసించారు.