'ఇజ్రాయెల్ ఒక క్యాన్సర్ దేశం' — పాకిస్థాన్ రక్షణ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు
పాక్ అసలు రంగు బయటపడింది
ఇజ్రాయెల్, పాకిస్థాన్ మధ్య మాటల యుద్ధం
ఇస్లామాబాద్: ఇజ్రాయెల్, పాకిస్థాన్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఇజ్రాయెల్ ను నాశనం చేయాలని పాకిస్థాన్ రక్షణశాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్(Pakistan's Defence Minister Khawaja Asif) సంచలన వ్యాఖ్యలు చేశారు. పాక్ మంత్రి వ్యాఖ్యలను ఇజ్రాయెల్ తీవ్రంగా ఖండించింది. పాక్ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఇజ్రాయెల్ ను క్యాన్సర్ దేశంగా పేర్కొన్నారు. లెబనాన్ లో ఇజ్రాయెల్ నరమేధం సృష్టిస్తోందని ఖవాజా ఆరోపించారు.
పాక్ మంత్రి ఖవాజా వ్యాఖ్యలు ఏ మాత్రం సహించరానివని ఇజ్రాయెల్ మండిపడింది. శాంతి చర్చలకు మధ్యవర్తిత్వం పేరుతో ఇలాంటి వ్యాఖ్యలు సరికాదని ఇజ్రాయెల్ చురకలంటించింది. ఖవాజా వ్యాఖ్యలతో పాకిస్థాన్ అసలు రంగు బయటపడిందని ఇజ్రాయెల్ తెలిపింది. పాక్ తటస్థ మధ్యవర్తిగా ఉండగలదా అని ఇజ్రాయెల్ సందేహం వ్యక్తం చేసింది. ఉగ్రవాదుల నుంచి తమ దేశాన్ని రక్షించుకుంటామని ఇజ్రాయెల్ తెల్చిచెప్పింది.




