10 April, 2026 | 3:24 PM

Breaking News

ఉపాధి హామీ పనులు వేసవిలో ఉదయం పూట చేసుకోవాలి   •   'ఇజ్రాయెల్ ఒక క్యాన్సర్ దేశం' — పాకిస్థాన్ రక్షణ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు   •   క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు   •   ఫార్మా కంపెనీలో గాయపడిన కార్మికులకు అండగా ఉంటాం   •   అమెరికా, ఇరాన్ శాంతి చర్చలపై కమ్ముకున్న నీలినీడలు   •   తల్లి ఇద్దరు కుమార్తెల హత్య.. భర్తతోపాటు ఆ 10 మంది అరెస్ట్   •   బీఆర్ఎస్ కట్టిన ప్రాజెక్టులన్నీ కాసుల కోసమేనా? అన్నీ మామ, అల్లుడికే తెలుసంటే ఎలా?   •   కాళేశ్వరం దేవస్థానం డైరెక్టర్ గా నియమితులైన కాటం సత్యం   •   గోదావరి పుష్కరాల ఘాట్లకు వెళ్లే రోడ్లను నిర్ణీత సమయంలోగా పూర్తి చేయాలి   •   రచ్చ పల్లిలో చలివేంద్రం ప్రారంభించిన సర్పంచ్ కనవేన స్వప్న శ్రీనివాస్   •  

పాకిస్థాన్‌దే వన్డే సిరీస్

20-12-2024 10:55 PM

కేప్‌టౌన్: సౌతాఫ్రికాతో జరుగుతున్న వన్డే సిరీస్‌ను పాకిస్థాన్ మరొక మ్యాచ్ మిగిలి ఉండగానే 2 కైవసం చేసుకుంది. గురువారం అర్థరాత్రి జరిగిన రెండో వన్డేలో పాకిస్థాన్ 81 పరుగుల తేడాతో సఫారీలపై విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 49.5 ఓవర్లలో 329 పరుగులకు ఆలౌటైంది. మిడిలార్డర్ బ్యాటర్లు మహ్మద్ రిజ్వాన్ (82 బంతుల్లో 80), బాబర్ ఆజం (95 బంతుల్లో 73) రాణించగా.. కమ్రాన్ గులామ్ (32 బంతుల్లో 63) మెరుపు ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. 

సౌతాఫ్రికా బౌలర్లలో క్వెనా మఫాకా 4 వికెట్లు తీయగా.. మార్కో జాన్సెన్ 3 వికెట్లు పడగొట్టాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 43.1 ఓవర్లలో 248 పరుగులకు ఆలౌటైంది. వికెట్ కీపర్ హెనిరిచ్ క్లాసెన్ (74 బంతుల్లో 97) మెరుపు ఇన్నింగ్స్ ఆడినప్పటికీ మిగతావారు విఫలమయ్యారు. టోనీ డి జార్జి (34) పర్వాలేదనిపించాడు. పాక్ బౌలర్లలో షాహిన్ అఫ్రిది 4, నసీమ్ షా 3 వికెట్లు పడగొట్టారు. మెరుపు అర్థసెంచరీ సాధించిన కమ్రాన్ గులామ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. ఇరుజట్ల మధ్య మూడో వన్డే ఆదివారం జరగనుంది.