1 July, 2026 | 10:18 PM

Breaking News

ప్రజల పన్నులతో నిర్మించిన 'మహాప్రస్థానం'పై..   •   లయన్స్ క్లబ్ బాన్సువాడ నూతన అధ్యక్షుడిగా పాత బాలకృష్ణ   •   ఓదెల మల్లన్న ఆలయంలో భక్తులపై తేనెటీగల దాడి   •   రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలోని ఆలయాలకు ఉత్సవాలు నిర్వహిస్తాం   •   ఘనంగా ఎల్‌హెచ్‌పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న గిరిజన నాయకులు   •   విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు   •   సందీప్ నగర్ కాలనీ సమస్యలపై కమిషనర్ స్పందన   •   పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది   •   ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •  

పాకిస్థాన్‌దే వన్డే సిరీస్

20-12-2024 10:55 PM

కేప్‌టౌన్: సౌతాఫ్రికాతో జరుగుతున్న వన్డే సిరీస్‌ను పాకిస్థాన్ మరొక మ్యాచ్ మిగిలి ఉండగానే 2 కైవసం చేసుకుంది. గురువారం అర్థరాత్రి జరిగిన రెండో వన్డేలో పాకిస్థాన్ 81 పరుగుల తేడాతో సఫారీలపై విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 49.5 ఓవర్లలో 329 పరుగులకు ఆలౌటైంది. మిడిలార్డర్ బ్యాటర్లు మహ్మద్ రిజ్వాన్ (82 బంతుల్లో 80), బాబర్ ఆజం (95 బంతుల్లో 73) రాణించగా.. కమ్రాన్ గులామ్ (32 బంతుల్లో 63) మెరుపు ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. 

సౌతాఫ్రికా బౌలర్లలో క్వెనా మఫాకా 4 వికెట్లు తీయగా.. మార్కో జాన్సెన్ 3 వికెట్లు పడగొట్టాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 43.1 ఓవర్లలో 248 పరుగులకు ఆలౌటైంది. వికెట్ కీపర్ హెనిరిచ్ క్లాసెన్ (74 బంతుల్లో 97) మెరుపు ఇన్నింగ్స్ ఆడినప్పటికీ మిగతావారు విఫలమయ్యారు. టోనీ డి జార్జి (34) పర్వాలేదనిపించాడు. పాక్ బౌలర్లలో షాహిన్ అఫ్రిది 4, నసీమ్ షా 3 వికెట్లు పడగొట్టారు. మెరుపు అర్థసెంచరీ సాధించిన కమ్రాన్ గులామ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. ఇరుజట్ల మధ్య మూడో వన్డే ఆదివారం జరగనుంది.