ఆమనగల్లు పశు వైద్యాధికారిగా పల్లవి
10-06-2026 12:21 AM
ఆమనగల్లు, జూన్ 9, (విజయక్రాంతి): ఆమనగల్లు మండల పశు వైద్యశాలలో విద్యాధికారిగా పల్లవి బాధ్యతలు మంగళవారం స్వీకరించారు. సాధారణ బదిలీలలో భాగంగా సిద్దిపేట జిల్లా ములుగు మండలం నుంచి ఆమె ఆమనగల్లుకు బదిలీపై వచ్చారు. ఇప్పటివరకు తలకొండపల్లి పశు వైద్య అధికారిగా విజయ్ కుమార్ ఇన్చార్జిగా సేవలందించారు. ఈ సందర్భంగా పల్లవి మాట్లాడుతూ.. పశుపోషకులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తానని పల్లవి తెలిపారు.






