17-06-2025 12:00:00 AM
సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం బుధేరా పంచాయతీ కార్యదర్శి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. బుధేరా గ్రామంలో వాటర్ సర్వీసింగ్ షెడ్ నిర్మాణానికి, ఇంటి నంబర్ కేటాయింపు అనుమతి కోసం గ్రామ కార్యదర్శి పట్లోళ్ల నాగలక్ష్మిని గ్రామస్థులు సంప్రదించారు. ఇందుకు గాను రూ.8 వేలు లంచం ఇవ్వాలని కార్యదర్శి డిమాండ్ చేశారు. దీంతో బాధితులు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు.
సోమవారం పంచాయతీ కార్యాలయంలో రూ.8 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ ఆధ్వర్యంలో రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఆమెను అరెస్టు చేసిన ఏసీబీ అధికారులు నాంపల్లి ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టగా 14 రోజుల రిమాండ్ విధించినట్లు తెలిపారు.