16-06-2025 11:04:45 PM
కోదాడ: కోదాడ మండల పరిధిలోని చిమిర్యాల గ్రామం పిఎసిఎస్ కార్యాలయ ఆవరణలో చైర్మన్ కొత్త రఘుపతి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి(MLA Padmavathi Reddy) జన్మదిన వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి పాల్గొని కేక్ కట్ చేశారు. అనంతరం ఆమెను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ చైర్మన్ వంగవీటి రామారావు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కొత్త గురవయ్య, మాజీ సర్పంచ్ కొండ శైలజ, పూర్ణ, నాగిరెడ్డి, వీర ప్రసాద్, మాధవరావు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.