13-11-2025 12:00:00 AM
-సౌతాఫ్రికాతో తొలి టెస్ట్
-భారత ప్లేయింగ్ XI పై క్లారిటీ
-భారత్ ఏ సిరీస్కు నితీశ్ రెడ్డి
కోల్కత్తా, నవంబర్ 12 : భారత్, సౌతాఫ్రికా మధ్య టెస్ట్ సిరీస్కు కౌంట్డౌన్ మొద లైంది. శుక్రవారం నుంచి ఈడెన్ గార్డెన్స్వేదికగా తొలి టెస్ట్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే ఇరు జట్లు ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్నాయి. అయితే భారత తుది జట్టుపై క్లారిటీ వచ్చేసింది. అంతా అనుకున్నట్టుగానే తుది జట్టులో ఇద్దరు వికెట్ కీపర్లు ఉండబోతున్నారు. రిషబ్ పంత్ కీపింగ్ బాధ్యతలు తీసుకోనుండగా, జురెల్ స్పెషలిస్ట్ బ్యాటర్గా ఆడనున్నాడు. కోచ్ ర్యాన్ డస్కాటే దీనిపై క్లారిటీ ఇచ్చేశాడు.
పంత్, జురెల్ ఇద్దరూ తొలి టెస్ట్ ఆడతారని చెప్పా డు. గత వారం రోజులుగా భారత తుది జట్టులో ఇద్దరు వికెట్ కీపర్లపై తీవ్ర చర్చ జరుగుతోంది. ప్రధాన వికెట్ కీపర్గా పంత్ ను, బ్యాకప్గా జురెల్ను సెలక్టర్లు ఎంపిక చేశారు. అయితే జురెల్ సౌతాఫ్రికా ఏ జట్టు తో జరిగిన అనధికారిక టెస్టులో దుమ్మురేపాడు. రెండు ఇన్నింగ్స్లోనూ శతకాలు బాదాడు. తొలి ఇన్నింగ్స్లో 132, రెండో ఇన్నింగ్స్లో 127 పరుగులు చేశాడు. రెండు ఇన్నింగ్స్లోనూ నాటౌట్గా నిలిచి జట్టుకు మంచి స్కోర్లు అందించాడు. ఇటీవల విండీస్పైనా జురెల్ సెంచరీ చేశాడు.
పంత్ గా యం నుంచి కోలుకోకపోవడంతో ఆ సిరీస్లో ప్రధాన వికెట్ కీపర్గా బాధ్యతలు అం దుకున్నాడు. తాజాగా అతని వరుస సెంచరీలతో కోచ్ గంభీర్, కెప్టెన్ గిల్కు తుది జట్టు ఎంపిక మరింత తలనొప్పిగా మారింది. జురెల్ను పక్కన పెట్టలేని పరిస్థితి.. అదే సమ యంలో తుది జట్టులో ఎవరిని తప్పించి అతన్ని తీసుకోవాలనే దానిపై తర్జన భర్జన పడ్డారు. చివరికి పేస్ ఆల్రౌండర్ నితీశ్కుమార్ రెడ్డి స్థానంలో జురెల్ ఆడబోతున్నా డు. సాయి సుదర్శన్ను పక్కన పెడతారని భావించినా నితీశ్ రెడ్డినే తప్పించారు.
భారత్ ఏ జట్టులోకి నితీశ్ రెడ్డి
తొలి టెస్టు తుది జట్టులో నితీశ్కు చోటు లేకపోవడంతో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఆల్రౌండర్ను భారత్ ఏ, సౌతా ఫ్రికా ఏ జట్టు సిరీస్ కోసం ఎంపిక చేసింది. దీంతో నితీశ్ రెడ్డి తిలక్ వర్మ కెప్టెన్సీలో సౌతాఫ్రికా ఏ జట్టుతో జరిగే అనధికారిక పరిమిత ఓవర్ల సిరీస్లో ఆడనున్నాడు.
39 ఏళ్ల తర్వాత
సాధారణంగా తుది జట్టులో ఇద్దరు వికెట్ కీపర్లు ఉండడం చాలా అరుదు. వన్డేల్లో ధోనీ, దినేశ్ కార్తీక్, పార్టీవ్ పటేల్ కలిసి ఆడినప్పటకీ... టెస్ట్ తుది జట్టులో ఉన్న సందర్భాలు లేవు. గతంలో 1986లో కిరణ్ మోరె, చంద్రకాంత్ పండిట్ కలిసి ఒకటి రెండు టెస్టులు ఆడాడు. అప్పుడు పండిట్కు స్పెషలిస్ట్ బ్యాటర్గా అవకాశం దక్కింది. ఇప్పుడు మళ్లీ 39 ఏళ్ల తర్వాత ఒకే టెస్టులో ఇద్దరు వికెట్ కీపర్లు(పంత్, జురెల్)తో భారత్ బరిలోకి దిగుతోంది.
తుది జట్టులో ముగ్గురు పేసర్లు
ఇదిలా ఉంటే జురెల్, పంత్ ఇద్దరూ తొలి టెస్ట్ ఆడతారని తేలిపోవడంతో భారత తుది జట్టుపై కూడా దాదాపుగా క్లారిటీ వచ్చేసింది. ఈ మ్యాచ్లో టీమిండియా ముగ్గురు పేసర్లతో బరిలోకి దిగనుంది. బుమ్రా, సిరాజ్లకు తోడు ఆకాశ్ దీప్ కూడా ఆడను న్నాడు. అటు స్పిన్ విభాగంలో రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్తో పాటు కుల్దీప్ యాదవ్కు చోటు దక్కనుంది. అంటే భారత జట్టు ఆరుగురు బౌలర్లతో ఆడబోతోంది.
తొలి టెస్టుకు స్పోర్టింగ్ పిచ్
మరోవైపు సొంతగడ్డపై ఎప్పుడూ స్పిన్ పిచ్లకే ప్రాధాన్యతనిచ్చే టీమిండియా ఈ సారి స్పోర్టింగ్ వికెట్ రూపొందించాలని క్యూరేటర్కు స్పష్టం చేసింది. న్యూజిలాండ్పై స్పిన్ పిచ్తోనే వైట్వాష్ చేయించుకున్న అనుభవంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. పైగా సఫారీ స్పిన్నర్లు కూడా మంచి ఫామ్లో ఉండడం మరొక కారణం. అందుకే పిచ్ విషయంలో క్యూరేటర్కు కోచ్ గంభీర్, కెప్టెన్ గిల్ స్పష్టమైన ఆదేశాలిచ్చారు. ప్రాక్టీస్ సెషన్స్ సందర్భంగా గిల్, గంభీర్ పిచ్ గురించి చాలా సేపు చర్చించుకున్నారు. దీంతో ఈడెన్ పిచ్ ఆరంభంలో పేసర్లకు కాస్త అనుకూలించి క్రమంగా బ్యాటర్లు నిలదొక్కుకునేందుకు వీలుంటుందని అంచనా వేస్తున్నారు.