17 April, 2026 | 2:38 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

మండల పంచాయతీ అధికారిగా ఎంపికైన పవన్ కు సన్మానం..

19-10-2025 06:48 PM

సుల్తానాబాద్ (విజయక్రాంతి): సుల్తానాబాద్ పట్టణంలోని స్వప్న కాలానికి చెందిన పిట్టల  పద్మ - సాగర్ దంపతుల కుమారుడు పవన్ కుమార్ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన గ్రూప్-2 ఫలితాలలో 327 ర్యాంకు సాధించి, శనివారం హైదరాబాదులోని శిల్పారామంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ద్వారా మండల పంచాయతీ అధికారిగా నియామక పత్రం అందుకున్నా  పవన్ ను ఆదివారం కాలనీవాసులు ఘనంగా సన్మానించారు.

గత ఆరు నెలల క్రితం ప్రభుత్వ విడుదల చేసిన గ్రూప్-4 పరీక్షలలో ఎంపికై పెద్దపల్లి కమర్షియల్ టాక్స్ ఆఫీసులో జూనియర్ అసిస్టెంట్ విధులు నిర్వహిస్తున్న పవన్ ఎంపిక పట్ల కాలనీవాసులు హర్షం వ్యక్తం చేస్తూ పవన్ ను మహిళలు మిఠాయిలు తినిపించి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ వార్డు సభ్యులు అమిరిశెట్టి తిరుపతి, కాలనీ మహిళలు రాజేశ్వరి, రమాదేవి ,శ్వేత,శారద,మౌనిక, మేఘమాల, రాధా మనిషా, రమ్య, సుజాత తదితర మహిళలు పాల్గొన్నారు.