27 July, 2026 | 8:11 PM

Breaking News

ఉరుమడ్ల మహిళల సత్తా.. రాష్ట్ర స్థాయి త్రోబాల్ పోటీలకు అర్హత.   •   విత్తనాల మేళాను సద్వినియోగం చేసుకోండి   •   తరుగు పేరుతో రూ.71 లక్షల అవినీతి   •   మండల సమావేశాన్ని బహిష్కరించిన ఫీల్డ్ అసిస్టెంట్లు   •   దోరకుంటలో వన మహోత్సవం   •   చిన్నకాపర్తి చెరువులకు పిలాయిపల్లి కాలువ నీరు అందించాలి   •   ఎస్సీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియామకం   •   మూడేళ్లుగా కూలిన హాస్టల్ గోడ.. పునర్నిర్మించాలని పీడీఎస్‌యూ డిమాండ్   •   దళితుడిని హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలి   •   సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్స్ ఇండియా చేతికి రీసెంట్ బ్లాక్‌బస్టర్ 'చెన్నై లవ్ స్టోరీ' డిజిటల్, శాటిలైట్ హక్కులు   •  

29న కొండగట్టుకు పవన్ కల్యాణ్‌

26-06-2024 12:23 AM

వారాహి దీక్షలో ఏపీ డిప్యూటీ సీఎం

హైదరాబాద్, జూన్ 25 (విజయక్రాంతి): ఈ నెల 29న ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, పవన్ కల్యాణ్ తెలంగాణ పర్యటనకు రానున్నారు. ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయస్వామి దర్శనం కోసం ఆయన జగిత్యాల జిల్లాకు విచ్చేయనున్నారు. ఎన్నికల ముందు కూడా ఆయన కొండగట్టును దర్శించుకున్నారు. ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేసిన తర్వాత తొలిసారి అంజన్నను దర్శించుకోనున్నారు. కాగా, కొండగట్టు అంజన్న పవన్‌కల్యాణ్ సెంటిమెంట్‌గా భావిస్తూ వస్తున్నారు. 

ఇందులో భాగంగానే 29న కొండగ ట్టులో మొక్కులు సమర్పించుకోనున్నట్లు సమాచారం.  ఇదిలా ఉండగా పవన్ మంగళవారం వారాహి మాత దీక్షను చేపట్టారు. ఎన్నికల సమయంలో ఆయన ప్రచార రథం పేరు కూడా అదే కావడంతో పవన్ చేపట్టిన దీక్షపై హాట్‌టాపిక్ నడుస్తోంది. ఈ దీక్షను ఆయన 11 రోజులు పాటించనున్నారు. ఏపీలో 21 ఎమ్మెల్యే, రెండు ఎంపీ స్థానాల్లో అనూహ్య విజయం సొంతం చేసుకున్న జనసేన అధినేత పవన్.. తనపై ఎలాంటి దిష్టి, దృష్టి ప్రభా వం పడకుండా ఈదీక్షను చేపట్టినట్లు ప్రచారం జరుగుతోంది.