02-08-2025 01:19:48 AM
2023 సం.లో హత్య కేసులో, దొంగతనం , బెదిరింపులకు పాల్పడిన కేసులలో నిందితుడిగా మనోజ్
రాజన్న సిరిసిల్ల: ఆగస్టు 1 (విజయక్రాంతి) జిల్లాలో చందుర్తి మండలానికి చెం దిన బొల్లు మనోజ్ మహిళ హత్య కేసుతో పాటు, పలు హత్య కేసులల్లో, దొంగతనం, బెదిరింపులకు పాల్పడిన కేసులలో నిందుతుడిగా ఉన్నాడు. శాంతి భద్రతలకు విఘా తం కలిగిస్తూ తరచు ప్రజలను భయబ్రాంతులకు గురి చేయగా 2024 సంవత్సరంలో మనోజ్ పై రౌడి షీట్ ఓపెన్ చేసి పలు మా ర్లు కౌన్సెలింగ్ నిర్వహించిన అతని ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదని,
తరచు నే రాలకు పాల్పడుతు ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తూ శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరిస్తున్నందున జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా రౌడీ షీటర్ మనోజ్ పై పిడి యాక్ట్ అమలు చేయడానికి ఉత్తర్వులు జారీ చేశారు. వాటిని చందుర్తి సి.ఐ వెంకటేశ్వర్లు మనోజ్ కు పిడి యాక్ట్ ని ర్బంధ ఉత్తర్వులు అందించి, నిందితున్ని చర్లపల్లి జైలుకు తరలించారు.
ఈ సందర్బంగా జిల్లా ఎస్పీ మహేష్ గితే మాట్లాడుతూజిల్లాలో ప్రజలను భయబ్రాంతులకు గురి చే స్తూ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఎంతటి వారైనా ఉపేక్షించబోమని హె చ్చరించారు. జిల్లాలో ఉన్న రౌడి షీటర్స్ పై పాత కేసులలో ఉన్న నేరస్థులపై నిత్యం పోలీ స్ నిఘా ఉంటుందని, గతంలో పలు కేసులల్లో నిందితులుగా ఉండి తరచు నేరాలకు పాల్పడే వారిపై పిడి యాక్ట్ అమలు చేయ డం జరుగుతుందని హెచ్చరించారు.