calender_icon.png 22 June, 2025 | 11:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

10 క్వింటాళ్ల పిడిఎస్ రైస్ పట్టివేత

24-01-2025 10:53:55 PM

మహదేవపూర్ (విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండల కేంద్రం గుండా అక్రమంగా తలిస్తున్న 10 క్వింటాళ్ల  రేషన్ బియ్యాన్ని శుక్రవారం పట్టుకున్న పోలీసులు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం... మహారాష్ట్ర సిరివంచకు చెందిన జనగం సడవలి, ఎస్డి వకీల్ ఇద్దరు వ్యక్తులు బొలెరో వాహనంలో అక్రమంగా బియ్యాన్ని తరలిస్తున్నారని వచ్చిన సమాచారం మేరకు మండల కేంద్రంలో తనిఖీలు చేపట్టగా అక్రమంగా తరలుతున్న రేషన్ బియ్యాన్ని, బొలెరో వాహనాన్ని స్వాధీనం చేసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు. అక్రమ బియ్యం రవాణా చేస్తున్న నిందితులపై 6 ఏ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పవన్ కుమార్ తెలిపారు.