22-06-2025 09:32:26 AM
తిరుమల తిరుపతి దేవస్థానంలో(Tirumala Tirupati Devasthanam) ఆదివారం భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఆదివారం కావడంతో భారీ సంఖ్యలో భక్తులు వెంకన్న కొండకు చేరుకున్నారు. తిరుమలతో శ్రీవారి సర్వదర్శనం (Srivari Sarva Darshan) కోసం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్టుమెంట్లు నిండిపోయి శిలాతోరణం వరకు భక్తులు క్యూ లైనులో వేచి ఉన్నారు. తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోందని ఆయల అధికారులు ప్రకటించారు. శనివారం శ్రీవారిని రికార్డు స్థాయిలో (90,087) మంది భక్తులు దర్శించుకున్నారు. 41,891 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.3 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు పేర్కొన్నారు.