17-05-2025 12:00:00 AM
కొత్తగూడెం మే 16 (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కోర్టులో, 09 మందికి జరిమానా విధిస్తూ స్పెషల్ జ్యుడీషియల్ సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ మెండు రా జమల్లు శుక్రవారం తీర్పు చెప్పారు. కొత్తగూడెం వన్ టౌన్ ఎస్.ఐ జి. విజయ కథనం ప్రకారం వాహనాలు నడుపుతుండగా ఒక్కరిని (1) ఆపి బ్రేత్ ఎనలైజర్ ద్వారా పరీక్షిం చగా అతను,మద్యం తాగినట్టు నిర్ధారించి కోర్టులో, ప్రవేశపెట్టగా మెజిస్ట్రేట్ ముందు అతను నేరం ఒప్పుకొనగా జరిమానా విధించారు.
లక్ష్మిదేవిపల్లి ఎస్.హెచ్. ఓ.- జి. రమ ణారెడ్డి కథనం ప్రకారం ఇద్దరు (2) మద్యం త్రాగి వాహనంలో నడుపుచుండగా, బ్రీతింగ్ అనలైజర్ ద్వారా పరీక్షించగా మధ్యo త్రా గినట్లు రుజువు కాగా వీరిని కూడా కోర్టులో ప్రవేశపెట్టగా,అట్టి నేరం ఒప్పుకొనగా మేజిస్ట్రేట్ జరిమానా విధించగా జరిమానా చెల్లిం చారు.
పాల్వంచ టౌన్ ఎస్ హెచ్ ఓ. ఐ. జీవనరాజ్ పర్యవేక్షణలో వాహన తనిఖీ చేయు చుండగా, ఆరుగురు(6) వ్యక్తులు మద్యం త్రాగి వాహనం నడుపుతూ పట్టుబడ్డారు. వారికి బ్రీత్ ఎనలైజర్ ద్వారా పరీక్షించగా మద్యం తాగినట్లుగా రుజువు కాగా కోర్టులో, మెజిస్ట్రేట్ విచారించగా నేరం ఒప్పుకున్నారు.వెంటనే జరిమానాలు విధించగా అట్టి జర్మానాలు చెల్లించారు.