calender_icon.png 16 June, 2025 | 9:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమ్మె తేదీ మాత్రమే వాయిదా.. కార్మికుల పోరాటం కాదు

17-05-2025 12:00:00 AM

టీఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శీతల రోషపతి

హుజూర్ నగర్, మే 1౬: జాతీయ కార్మిక సంఘాలన్నీ మే 20న సమ్మె చేయాలని నిర్ణయించగా,భారత్ పాకిస్తాన్ ల మధ్య ఘర్షణల నేపథ్యంలో సమ్మె ను మాత్రమే వాయిదా వేయడం జరిగిందని,జులై 9న సమ్మె ఉంటుందని టి ఎన్ టి యు సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శీతల రోశపతి అన్నారు.

హుజూర్నగర్ లో రైస్ మిల్లర్ అసోసియేషన్ అధ్యక్షులు పోలిశెట్టి లక్ష్మీ నరసింహారావుకి,వర్తక సంఘం అసోసియేషన్ అధ్యక్షులు అయ్యప్ప కి సమ్మె నోటీస్ లను ఇచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సమ్మె మాత్రమే వాయిదా పడిందని పోరాటం కాదనే విషయాన్ని కార్మికులంతా గుర్తుంచుకోవాలన్నారు.

రైస్ మిల్ డ్రైవర్లు,హమాలీలు, కూలీలు పెద్ద ఎత్తున పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టిఎన్టిసి నాయకులు రైస్ మిల్ డ్రైవర్ యూనియన్ అధ్యక్షులు గుండె పోయిన ఎంకన్న యాదవ్ దిన కూలీల యూనియన్ అధ్యక్షులు కార్యదర్శి స్వరూప సుకన్య కోటమ్మ రామయ్య తదితరులు పాల్గొన్నారు.