calender_icon.png 4 August, 2025 | 10:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజల సమస్యలు వెంటనే పరిష్కరించాలి

04-08-2025 07:56:39 PM

హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్..

హనుమకొండ టౌన్ (విజయక్రాంతి): హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాలులో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి వివిధ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ప్రజలు 181 అర్జీలను అందజేశారు. ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్(District Collector Sneha Shabarish), జిల్లా రెవెన్యూ అధికారి వై.వి. గణేష్(District Revenue Officer Y.V. Ganesh) ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. ప్రజలు అందజేసిన అర్జీలపై కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులు స్పందించి సంబంధిత సమస్యలను పరిష్కరించేందుకు వెంటనే చర్యలు చేపట్టాలని అప్పటికప్పుడే జిల్లా అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిఆర్డిఓ మేన శ్రీను, హనుమకొండ, పరకాల ఆర్డీవోలు రాథోడ్ రమేష్, డాక్టర్ కే. నారాయణ, జిల్లా అధికారులు పాల్గొన్నారు.