29-10-2025 10:56:22 AM
ఎస్సై ఈట సైదులు
జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి): మండల వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో మండల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని జాజిరెడ్డిగూడెం మండల ఎస్సై ఈట సైదులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దన్నారు.నీటి సమీపంలో ఉండే వంతెనలు,కట్టలు దాటవద్దని,జలపాతాలు,వాగులు,చెరువులకు వెళ్ళవద్దని,ఎలక్ట్రిక్ పోళ్లు,వైర్లను తాకవద్దని సూచించారు.పాత ఇళ్లల్లో ఉండకూడదని,తల్లిదండ్రులు పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు.వాహనదారులు జాగ్రత్తలు పాటించాలని,రైతులు చెట్ల కింద,కరెంటు వైర్ల కింద ఉండొద్దని చెప్పారు.మొoథా తుఫాను ప్రభావంతో ప్రజలందరూ తప్పనిసరిగా అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు.