6 April, 2026 | 4:57 PM

Breaking News

విరాట్ హిందూ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలి   •   కోల్‌కతాపై దాడి చేస్తామన్న పాక్.. మోదీపై మమతా బెనర్జీ విమర్శలు   •   కరీంనగర్‌లో ఘనంగా భారతీయ జనతా పార్టీ 47వ ఆవిర్భవ దినోత్సవ వేడుకలు   •   ఢిల్లీ అసెంబ్లీ దగ్గర హైటెన్షన్.. వీఐపీ గేటులోంచి దూసుకొచ్చిన మాస్క్ మ్యాన్ కారు   •   ఉపాధి హామీ పనిలో విషాదం – మహిళ మృతి   •   గోపాలరావుపల్లిలో ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం ఘనంగా నిర్వహణ   •   మాజీ ఎంపీటీసీ ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభం   •   సెస్ విలీనంతో పారదర్శక పాలన వినియోగదారులకు నాణ్యమైన సేవలు   •   ముఖ్యమంత్రిని సన్మానించిన ఖానాపూర్ కాంగ్రెస్ కౌన్సిలర్లు   •   ఉమామహేశ్వరంలో ప్రభుత్వ విప్ ప్రత్యేక పూజలు   •  

ప్రజలే గుణపాఠం చెప్తారు

06-04-2026 03:06 PM

సుల్తానాబాద్,(విజయక్రాంతి): రానున్న రోజుల్లో అధికార పార్టీ ప్రజా ప్రతినిధులకు ప్రజలే గుణపాఠం చెప్తారని ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో(Municipal Elections) బిఆర్ఎస్ నుండి పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థులు సూర శ్యామ్ , రేవల్లి తిరుపతి లు అన్నారు, పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ... మున్సిపల్ ఎన్నికల్లో తప్పుడు ఓట్లతో, తప్పుడు కుల ధ్రువీకరణ పత్రంతో అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ ఎనిమిది, తొమ్మిదవ వార్డు అభ్యర్థులపై జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేశామని, ఎన్నికల కమిషనర్, హైకోర్టును ఆశ్రయిస్తామన్నారు, ఈ విలేకరుల సమావేశంలో బిఆర్ఎస్ నాయకులు తిప్పారపు దయాకర్, అనుమాల బాబురావు, మహేష్ , అజయ్, అక్బర్, అనిల్, కాళీ చరణ్ , వెంకటేష్ , రాజు పలువురు పాల్గొన్నారు.