24 August, 2026 | 10:06 PM

Breaking News

మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి   •   ఐటీఐలో ఖాళీ సీట్ల భర్తీకి అవకాశం   •   ఆలేరు జెడ్పీహెచ్‌ఎస్‌ విద్యార్థులకు అన్వర్ స్కాలర్‌షిప్   •   ఒంటరి మహిళల సర్టిఫికెట్లకు తిప్పలు!   •   సంగమేశ్వర స్వామివారిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య   •   గణేష్ మాండపాలకు ఉచిత కరెంటు ఇవ్వాలని వినతి   •   చిరుతపులి చర్మం, గోర్లను అక్రమంగా విక్రయించేందుకు ప్రయత్నించిన నలుగురు వ్యక్తులు అరెస్ట్   •   యంగ్ ఇండియా పాఠశాలను జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయాలి   •   పోచమ్మ దేవత విగ్రహ ప్రతిష్టకు ఆహ్వానం   •   ప్రభుత్వ ఆసుపత్రి డైట్ క్యాంటీన్ ను తనిఖీ చేసిన ఆహార భద్రతా అధికారి జి వరుణ్ రెడ్డి   •  

సునంద రైస్ మిల్లును శాశ్వత నిషేధం విధించాలి

24-08-2026 08:28 PM

ప్రజల ఆరోగ్యం భద్రత ప్రమాణాలను పాటించాలి

ఎమ్మార్పీఎస్ నాయకులు కొత్తపల్లి రవి

గరిడేపల్లి,(విజయక్రాంతి): ప్రజావాసాల మధ్య నిర్వహిస్తున్న సునంద రైస్ మిల్లుకు తిరిగి అనుమతులు ఇవ్వకుండా శాశ్వత నిషేధం విధించాలని ఎమ్మార్పీఎస్ గరిడేపల్లి మండల అధ్యక్షుడు కొత్తపల్లి రవి డిమాండ్ చేశారు. సోమవారం ప్రజావాణిలో ఎంపీడీవో ఆర్. సరోజకు ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మిల్లు వల్ల కాలుష్యం, దుమ్ము, శబ్దం తదితర సమస్యలతో స్థానిక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.

గతంలో అధికారుల తనిఖీల్లో పలు అవకతవకలు గుర్తించినట్లు, విజిలెన్స్ అధికారులు ఎన్ఫోర్మేంట్ అధికారుల సంయుక్త దాడులలో ప్రభుత్వానికి కోట్ల రూపాయలు నష్టం కలిగించినట్లు ఆరోపణలు ఉన్నాయని పేర్కొన్నారు.ప్రజల ఆరోగ్యం, భద్రతను దృష్టిలో ఉంచుకుని మిల్లుకు పునఃప్రారంభ అనుమతులు ఇవ్వకూడదని కోరారు. అధికారులు స్పందించకపోతే ప్రజా సంఘాలు, రాజకీయ పక్షాలతో కలిసి ఆందోళనలు, ధర్నాలు చేపడతామని హెచ్చరించారు.