12-06-2025 06:24:27 PM
అహ్మదాబాద్: గుజరాత్ అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం(Sardar Vallabhbhai Patel International Airport) నుంచి లండన్ బయల్దేరిన ఎయిరిండియా ఫ్లైట్ నెంబర్ ఏఐ-171 విమానం కూలిపోయింది. ప్రమాద మరణాలపై అహ్మదాబాద్ సీపీ జ్ఞానేంద్ర సింగ్ మాలిక్(CP Gyanendra Singh Malik) ఆసక్తికర ప్రకటన చేశారు. ఈ విమాన ప్రమాదంలో ఒక్కరు కూడా బతికే అవకాశం లేదని వెల్లడించారు. ఏపీ(Associated Press) అనే అంతర్జాతీయ మీడియా సంస్థతో అహ్మదాబాద్ సీపీ ఈ విషయాన్ని తెలుపుకున్నారు. కాగా, ఎయిరిండియా విమానంలో 230 మంది ప్యాసింజర్లు, 10 మంది సిబ్బంది, ఇద్దరు పైలట్లు ఉన్న విషయం తెలిసిందే. అలాగే విమాన దుర్ఘటనలో అహ్మదాబాద్ పోలీసులు 25 మంది క్షతగాత్రుల వివరాలను వెల్లడించారు.