24-06-2025 12:25:37 AM
రాజేంద్రనగర్, జూన్ 23: ప్లాస్టిక్ వినియోగించిన పలువురికి నార్సింgi మున్సిప ల్ సిబ్బంది 20 వేల జరిమానా విధించారు. వంద రోజుల ప్రణాళిక కార్యక్రమంలో పర్యావరణ పరిరక్షణ భాగంలో గండిపేట్ లో ప్లాస్టిక్, ట్రేడ్ లైసెన్స్ విషయంలో మున్సిపల్ అధికారులు సోమవారం తనిఖీలు నిర్వహించారు.
ఈ సందర్భంగా 150 కేజీల ప్లాస్టిక్ ను స్వాధీనం చేసుకున్నారు. ట్రేడ్ లైసెన్స్ లేనివారికి, ప్లాస్టిక్ వాడుతున్న వారికి 20 వేల జరిమానా విధించారు. ట్రేడ్ లైసెన్స్ తీసుకోకుండా తన ఇష్టం ఉన్నప్పుడు తీసుకుంటాను.. మీరు ఎవరు నాకు చెప్పడానికి అని మున్సిపల్ అధికారులతో దురుసుగా ప్రవర్తించిన వ్యక్తి షాపును సీజ్ చేశారు. తనిఖీల్లో శానిటేషన్ ఇన్స్పెక్టర్, వార్డు ఆఫీసర్లు, మున్సిపల్ సిబ్బందిపాల్గొన్నారు.