calender_icon.png 12 January, 2026 | 3:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏకశిల వెంచర్‌లో ప్లాట్ల వివాదం

11-01-2026 12:07:55 AM

పోలీసుల సమక్షంలో ఇరు వర్గాల దాడులు

ఇద్దరికి గాయాలు

ఘట్‌కేసర్, జనవరి 10 (విజయక్రాంతి) : మేడ్చల్ జిల్లా, ఉప్పల్ జోన్, ఘట్ కేసర్ సర్కిల్, పోచారం పరిధిలోని కోర్రెములలో ఏకశిల వెంచర్ భూవివాదం మరోసారి ముదిరింది. 1985లో వేసిన ఏకశిలా లేఅవుట్ భూములపై కన్నేసిన కబ్జాదారులు అధికారుల అండతో సర్వే చేసేందుకు ప్రయత్నించడం ఉద్రిక్తతకు దారితీసింది. తమ ప్రాణాలైనా ఇస్తాం కానీ, కష్టపడి కొనుక్కున్న ప్లాట్లను వదులుకోబోమని బాధితు లు హెచ్చరిస్తున్నారు. భూ కబ్జాదారులు ఫ్లాట్ ఓనర్స్ మధ్య వివాదం ముదిరి ఘర్షణకు దారితీసింది. ఈ ఘర్షణలో ఇద్దరికి గాయాలయ్యాయి. కొర్రెముల పరిధి లోని సర్వే నంబర్లు 739 నుండి 749 వర కు ఉన్న సుమారు 10 సర్వే నంబర్లలో 1985లోనే ఏకశిలా లేఅవుట్ ఏర్పాటైంది.

అప్పటి నుంచి ఇక్కడ ప్లాట్లు కొనుగోలు చేసిన వందలాది మంది మధ్యతరగతి ప్రజలు నేడు రోడ్డున పడ్డారు. తాజాగా ఈ భూము ల్లో సర్వే నిర్వహిస్తున్నారన్న సమాచారంతో ప్లాట్ ఓనర్లు పెద్ద ఎత్తున తరలివచ్చి పనులను అడ్డుకున్నారు. వెంకటేష్ అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి కొంత మంది అధికారుల అండదండలతో ఈ విలువైన భూమిని ఆక్రమించుకోవాలని చూస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. చట్టబద్ధంగా కొనుక్కున్న భూముల్లో అక్రమంగా సర్వే చేయడం ఏంట ని వారు ప్రశ్నిస్తున్నారు. తమ ప్లాట్ల రక్షణ కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధమని, అక్రమ కబ్జాలను సాగనివ్వమని భీష్మించుక కూర్చు న్నారు. దశాబ్దాలుగా నలుగుతున్న ఈ వివాదంపై ప్రభుత్వం ఉన్నతాధికారులు స్పందిం చి, అమాయక ప్లాట్ ఓనర్లకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.