03-06-2025 11:53:06 AM
న్యూఢిల్లీ: భారీ వర్షాల కారణంగా వరదల్లో చిక్కుకున్న ఈశాన్య రాష్ట్రాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) అన్ని విధాలుగా సహాయం, మద్దతు లభిస్తుందని హామీ ఇచ్చారు. వరదల్లో చిక్కుకున్న ఈశాన్య రాష్ట్రాల పరిస్థితిని సమీక్షించడానికి మోడీ అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ, సిక్కిం సీఎం ప్రేమ్ సింగ్ తమాంగ్ లతో పాటు మణిపూర్ గవర్నర్ అజయ్ భల్లాతో మాట్లాడారు.
తమ రాష్ట్రాల్లో వద పరిస్థితులను అసోం, సిక్కిం సీఎంలు ప్రధానికి వివరించడంలో అక్కడ నిర్వహిస్తున్న వరద సహాయక చర్యలపై ఆరా తీశారు. తీవ్ర నష్ట్రం జరిగిందని కేంద్ర ప్రభుత్వం తమ రాష్ట్రాలను ఆదుకోవాలని సీఎంలు మోదీని కోరారు. కేంద్రం నుండి రెండు రాష్ట్రాలను అన్ని విధాలుగా సహాయం, మద్దతు లభిస్తుందని ఆయన హామీ ఇచ్చారు. ఈశాన్య ప్రాంతంలో వరద పరిస్థితి ఇంకా క్లిష్టంగానే ఉంది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరదలు సంభవించడంతో కొండచరియలు విరిగిపడడంతో సోమవారం నాటికి మృతుల సంఖ్య 36కి పెరిగింది.