03-06-2025 11:09:54 AM
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) అధ్యక్షతన బుధవారం కేంద్ర మంత్రిమండలి భేటీ(Union Cabinet Meeting) జరుగనుంది. భారత్ పాకిస్థాన్ పై చేపట్టిన ఆపరేషన్ సిందూర్(Operation Sindoor) తర్వాత తొలిసారి కేబినెట్ సమావేశం కానుంది. కేబినెట్ మంత్రులతో పాటు సహయక మంత్రులు, స్వతంత్ర మంత్రులు కూడా హజరుకానున్నారు. కేంద్రంలో మూడోసారి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాడి త్వరలోనే ఏడాది పూర్తి కానున్న తరుణంలో మోదీ అధ్యక్షతన సుష్మా స్వరాజ్ భవన్ లో కేబినెట్ భేటీ కానుండడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఈ సమావేశంలో ఆపరేషన్ సిందూర్ కు దారితీసిన పరిస్థితులను మంత్రులందరికీ ప్రధాన మోదీ వివరించే అవకాశం ఉంది. ఆపరేషన్ సిందూర్ తో పాటు ఇతర అంశాలపై మంత్రులకు ఆయన దిశానిర్దేశం చేయనున్నారు. ప్రభుత్వ కీలక విధానాలను మంత్రిమండలిలో ఉన్నతస్థాయి అధికారుల సమక్షంలో ప్రధాని మోదీ చర్చించనున్నారు. తీవ్రవాదానికి వ్యతిరేకంగా త్రివిధ దళాలు చేపట్టిన ఆపరేషన్ ను ప్రజల్లోకి తీసుకెళ్లాలనదే ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యం. అలాగే జనాభా లెక్కలతో పాటు కుల గణన కూడా నిర్వహించాలని ప్రభుత్వ నిర్ణయంపై చర్చ జరిగే అవకాశం ఉంది. ఈ అంశంపై ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు గతవారం సమావేశమై చర్చించారు.