మార్కాపురం బస్సు దుర్ఘటనపై మోదీ సంతాపం — 14 మంది మృతికి రూ.2 లక్షల పరిహారం!
బస్సు ప్రమాదంలో సజీవదహనం.. అత్యంత విషాదకరం
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లోని మార్కాపురం జిల్లా(Markapuram Bus Accident) రాయవరం సమీపంలో గురువారం తెల్లవారుజామున జరిగిన ఒక ఘోర బస్సు ప్రమాదంలో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. జగిత్యాల నుండి వెళ్తున్న ఒక ప్రైవేట్ ట్రావెల్ బస్సు, స్థానిక స్లేట్ గనుల వద్ద వేగంగా దూసుకొస్తున్న ఒక టిప్పర్ ట్రక్కును ఢీకొనడంతో ఈ విషాదం చోటుచేసుకుంది. మార్కాపురం రోడ్డు ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Narendra Modi) దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.
బస్సు ప్రమాదంలో పలువురు సజీవదహనం కావడం అత్యంత విషాదకరం అన్నారు. బాధిత కుటుంబాలకు ప్రధాని ప్రగాఢ సానుభూతి తెలిపాపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని మోదీ ప్రార్థించారు. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50 వేల చొప్పున ప్రధాని మోదీ పరిహారం ప్రకటించారు. ఈ ఘోర బస్సు ప్రమాదంపై కేంద్రమంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తూ మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు.




