13-06-2025 12:57:02 PM
గుజరాత్: అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో ప్రాణాలతో బయటపడిన మృత్యుంజయుడు రమేశ్ విశ్వాస్ కుమార్(Vishwash Kumar Ramesh) ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ(Prime Minister Narendra Modi) శుక్రవారం కలిశారు. భారత సంతతికి చెందిన బ్రిటిష్ జాతీయుడు(British national of Indian descent) రమేష్. అహ్మదాబాద్లోని సివిల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తన 45 ఏళ్ల సోదరుడు అజయ్ కుమార్ రాకేష్ తో కలిసి ప్రయాణిస్తున్న రమేష్, తమ సమావేశంలో ప్రధాని మోడీకి తన బాధాకరమైన క్షణాలను వివరించాడు. "నా సోదరుడు వేరే వరుసలో కూర్చున్నాడు. అతను బ్రతకలేదు. నేను ఎలా ప్రాణాలతో బయటపడ్డానో నాకు ఇంకా అర్థం కాలేదు," అని ఆయన ప్రధానమంత్రికి అన్నారు.
ప్రమాదం(Air India crashes) తర్వాత మొదటి సారి మాట్లాడిన రమేశ్ విశ్వాస్ కుమార్ అంతా నా కళ్ల ముందే జరిగిందని చెప్పారు. నేను ఎలా బతికానో నాకే అర్థం కాలేదని వివరించాడు. విమానం కింద పడగానే నేను కూడా చనిపోయాననుకున్నానని, కళ్లు తెరిచి చూసేసరికి హాస్టల్ భవనం శిథిలాల్లో ఉన్నానని పేర్కొన్నాడు. శిథిలాల నుంచి మెల్లగా నడుచుకుంటూ వెళ్లాను.. మంటల ధాటికి నా ఎడమచేయికి గాయమైందని తెలిపారు. AI-171 విమాన ప్రమాదంలో ప్రాణాలతో బయటపడిన వ్యక్తి మరణం నుండి తప్పించుకున్న భయంకరమైన కథను వివరించాడు.
గురువారం సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం(Sardar Vallabhbhai Patel International Airport) నుంచి లండన్ కు బయలుదేరిన దురదృష్టకర బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కుప్పకూలింది. విమానాశ్రయానికి కేవలం 3 కి.మీ దూరంలో జనసాంద్రత కలిగిన మేఘనినగర్ ప్రాంతంలోని బిజె మెడికల్ కాలేజీ హాస్టల్ లోకి దూసుకెళ్లింది. ఘటన జరిగిన తక్షణమే అధికారులు భారీ స్థాయిలో సహాయక చర్యలు చేపట్టారు. గురువారం 242 మంది ప్రయాణికులు, సిబ్బందితో లండన్కు వెళ్తున్న ఎయిర్ ఇండియా ప్యాసింజర్ జెట్ విమానం అహ్మదాబాద్ నగరంలో టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఒక నిర్మాణ ప్రాంతంలో కూలిపోయింది. ప్రమాదం జరిగిన ప్రదేశంలో కనీసం 28 మందితో సహా కనీసం 269 మంది మరణించారని సీనియర్ పోలీసు అధికారి విశాక దబ్రాల్ తెలిపారు. ఒక ప్రయాణీకుడు ప్రాణాలతో బయటపడ్డాడని ఎయిర్ ఇండియా తెలిపింది.