బోడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోదేం స్వరూప నామినేషన్ దాఖలు
06-12-2025 12:00 AM
టేకులపల్లి, డిసెంబర్ 5,(విజయక్రాంతి): టేకులపల్లి మండలం బోడు గ్రామ పంచాయతీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోదేం స్వరూ ప శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. బోడు పంచాయతీ అభివృద్ధికి కృషి చేస్తానని, పంచాయతీ ప్రజలు తనను గెలి పించాలని కోరారు. నామినేషన్ కార్యక్రమం లో కాంగ్రెస్, తెలుగుదేశం, బీజేపీ నాయకులు రేఖ రామచంద్రం, పోదేం సుధీర్, భూ క్య సైదులు నాయక్,మాసిపాక రామస్వామి, పూణెం కృష్ణయ్య, కుంజ సాంబయ్య, ఇర్పా సమ్మయ్య, కొండారెడ్డి, ఈసం సత్యం, తాటి యశోద, బుర్ర నరేందర్ తదితరులు పాల్గొన్నారు.






