01-02-2026 12:39:06 PM
మహబూబ్ నగర్ (విజయక్రాంతి): జిల్లా వ్యాప్తంగా పోలీస్ యాక్ట్ అమలలో ఉంటుందని,శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా ఫిబ్రవరి 1 నుంచి 28 వరకు పోలీస్ యాక్ట్ 30, 30(A) అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ డి. జానకి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ... పోలీసుల ముందస్తు అనుమతి లేకుండా ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు, సభలు నిర్వహించకూడదన్నారు.
ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున సామాజిక మాధ్యమాల్లో ఇతరులను కించపరిచేలా పోస్టులు పెడితే కఠిన చర్యలు తప్పవన్నారు. చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయన్నారు. జిల్లా ప్రజలు, ప్రజా ప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు పోలీసులకు సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేశారు. నిబంధనలు పాటించకుండా ఈస్టునుసారంగా వ్యవహరిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు.