15 May, 2026 | 3:30 PM

Breaking News

అటవీ భూమిలో పశువుల పాకల నిర్మాణం.. గ్రామస్తుల వివాదం   •   బెల్లంపల్లి బస్తీలో పోలీసుల కార్డెన్ సెర్చ్   •   ముమ్మరంగా కొనసాగుతున్న జనగణన   •   శాతవాహన అర్థశాస్త్ర విభాగాధిపతి డా. శ్రీవాణికి పేటెంట్   •   ఇంధన ధరలు పెరిగితే అందరిపై భారం   •   రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిని కలిసిన కాంగ్రెస్ నేతలు   •   మంత్రి తుమ్మలను కలిసిన కల్లూరు, సత్తుపల్లి ఆర్యవైశ్య నాయకులు   •   సత్తుపల్లిలో నల్లమోతు శ్రీనివాస రావు కుటుంబ సభ్యులను పరామర్శించిన మంత్రి తుమ్మల   •   తెలుగు ఫిలిం ఛాంబర్ కీలక నిర్ణయం.. కమిటీ ఏర్పాటు   •   Fuel Price Hike: ‘మోదీ తప్పుకు ప్రజలు మూల్యం చెల్లిస్తున్నారు’: కేంద్రంపై రాహుల్ విమర్శలు   •  

బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన సెలబ్రిటీలపై కేసులు

20-03-2025 11:31 AM

హైదరాబాద్: బెట్టింగ్ యాప్స్(Betting Apps) ప్రమోట్ చేసిన వారిలో ఉన్న ప్రముఖ నటులపై కేసులు నమోదయ్యాయి. దగ్గబాటి రానా, విజయ్ దేవరకొండ(Vijay Deverakonda), ప్రశాశ్ రాజ్, మంచులక్ష్మి, ప్రణీత, నీతూ అగర్వాల్, యాంకర్లు శ్యామల, శ్రీముఖి, రీతూ చౌదరి, విష్ణుప్రియ, యూట్యూబర్ వర్షిణి సహా మొత్తం 25 మందిపై మియాపూర్ పోలీసులు(Miyapur Police) కేసు నమోదు చేశారు. అటు బెట్టింగ్ యాప్స్ కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో పాప్-అప్ యాడ్‌ల ద్వారా నిబంధనలను ఉల్లంఘించి బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసినందుకు ప్రముఖ నటీనటులపై మియాపూర్ నివాసి అయిన వ్యాపారవేత్త పిఎం ఫణీంద్ర శర్మ దాఖలు చేసిన ఫిర్యాదు ఆధారంగా 318(4), 112 రీడ్ విత్ 49 బిఎన్‌ఎస్, సెక్షన్ 3, 3(ఎ), 4 ఆఫ్ టిఎస్ గేమింగ్ యాక్ట్, సెక్షన్ (డి) ఆఫ్ ఐటి చట్టం కింద కేసులు నమోదు చేశారు. పంజాగుట్ట పోలీసులు ఇప్పటికే 11 మంది యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్లకు నోటీసులు జారీ చేశారు. దర్యాప్తులో భాగంగా, నటి విష్ణు ప్రియ(Actress Vishnu Priya) గురువారం విచారణకు హాజరయ్యారు. కేసుకు సంబంధించిన వివిధ అంశాలపై అధికారులు ఆమెను విచారిస్తున్నారని నివేదికలు సూచిస్తున్నాయి. ఇంతలో, విచారణకు హాజరు కావడానికి పలువురు యూట్యూబర్లు అదనపు సమయం కోరారు.