24-11-2025 12:37:11 AM
కన్నాయిగూడెం,నవంబరు23(నవిజయ క్రాంతి)ములుగు జిల్లా కన్నాయిగూడెం మండల కేంద్రంలో గల ప్రధాన రహదారిపై వాహనాల తనిఖీలు స్థానిక ఎస్త్స్ర ఇనిగాల వెంకటేష్ అద్వర్యంలో నిర్వహించారు.ఈ ప్రధాన రహదారిపై కన్నాయిగూడెం మండ లం నుండి ఏటూరునాగారం వైపుగా వచ్చి పోయో వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు చేశారు .
అనుమానితులను అదుపులోకి తీసుకుని వివరాలు సేకరించి వాహనాలకు సంబంధించిన డ్రైవింగ్ లైసెన్సు పేపర్లను పరిశీలించి వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ఖచ్చితంగా ధరించాలని హెల్మెట్ లేనియెడల జరిమాన విదిస్తామని హెచ్చరించారు హెల్మెట్ ధరించడం వలన ప్రాణాలు కాపాడుకోవచ్చని వారికి తెలిపారు ఈ కార్యక్రమంలో వాహనా దారులు,సివిల్ ,సీఆర్పీఎఫ్ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు