24-11-2025 12:35:58 AM
మహబూబాబాద్, నవంబర్ 23 (విజయక్రాంతి): వరంగల్ మహానగరంలోని చరిత్ర ప్రసిద్ధిగాంచిన శ్రీ భద్రకాళి అమ్మవారిని రాష్ట్ర పశుసంవర్ధక, క్రీడలు యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి ఆదివారం దర్శించుకున్నారు. పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కె.ఆర్ నాగరాజు, కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రాం రెడ్డి దంపతులు భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు.
ఆలయ ధర్మకర్త లు ఓరుగంటి పూర్ణచందర్, భద్రకాళి శేషు, ఈవో రామల సునీత పూనకుంభం స్వాగ తం పలికారు. పూజ అనంతరం ఆలయ మహా మండపంలో మహదాశీర్వచనం నిర్వహించి అమ్మవారి శేష వస్త్రము, ప్రసాదం అందజేశారు.