26-06-2025 09:05:44 PM
ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన భార్య.....
రెండు తెలుగు రాష్టాల్లో సంచలనం గా మారిన తేజశ్వర్ హత్య....
8 మంది అరెస్ట్ రిమాండ్ కు తరలింపు....
గద్వాల (విజయక్రాంతి): ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసు(Surveyor Tejeshwar Murder Case)ను గద్వాల పోలీసులు వేధించారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ శ్రీనివాసరావు మీడియా సమావేశంలో సర్వేయర్ తేజేశ్వర్ హత్యకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. తేజేశ్వర్ హత్యకేసులో కీలకంగా వివరించిన బ్యాంక్ మేనేజర్ తిరుమల రావుకు ఐశ్వర్య, తల్లి సుజాతతో అక్రమ సంబంధం ఉండేదని ఆ తర్వాత ఐశ్వర్యతో వివాహేతర సంబంధం పెట్టుకొని అలాగే కొనసాగించాలని బ్యాంక్ మేనేజర్ తిరుమల రావు అనుకున్నాడు. ఐశ్వర్య కు తేజేశ్వర్ ఎంగేజ్మెంట్ అయినప్పటి నుండి బ్యాంక్ మేనేజర్ సర్వేయర్ ను ఎలాగైనా హత మార్చాలని పథకాన్ని రూపొందించుకున్నాడు.
ఈ క్రమంలో ఐశ్వర్య కు గద్వాల పట్టణానికి చెందిన తేజశ్వర్ వివాహమైంది. ఈ క్రమంలోనే ఐశ్వర్య సైతం పెండడ్లి అయిన నెలకే తన భర్త తేజేశ్వరరావు హతమార్చాలని ప్లాన్ చేసుకుంది. దీంతో బ్యాంక్ మేనేజర్ తిరుమలరావు తనకు పరిచయం ఉన్న కుమ్మరి నగేష్, పరశురాములతో ఐశ్వర్య అనే అమ్మాయి తనను ప్రేమిస్తుందని ఈ మధ్యనే గద్వాల చెందిన తేజశ్వర్ వివాహమైందని ఎలాగైనా అతనిని హత మార్చాలని చెప్పి అందుకు కావాల్సిన డబ్బులు ఇస్తానని చెప్పారు. దీంతో కుమ్మరి నరేష్ సర్వేయర్ గా పనిచేస్తున్న తేజశ్వర్ పరిచయం పెంచుకొని తాము కర్నూల్ లో హోమ్ లోన్ ఏజెంట్గా పని చేస్తున్నామని గద్వాల పరిసర ప్రాంతాల్లో ఏమైనా పొలాలు ఉంటే చెప్పాలని కొనుగోలు చేస్తామని కమిషన్ కూడా ఇస్తామని పరిచయాన్ని కొనసాగించారు.
ఈ క్రమంలో పలుమార్లు గద్వాలకు వస్తున్న క్రమంలో పెండ్లికి వారం రోజుల ముందే హత మార్చాలని పథకం రచించినప్పటికీ తేజశ్వర్ ఎక్కడెక్కడ ఉన్నానని చెప్పడంతో వారి ప్లాన్ రద్దు చేసుకున్నారు. దీంతో బ్యాంకు మేనేజర్ ఆన్లైన్ లో ఒక జిపిఎస్ ట్రాకర్ ను ఆర్డర్ చేసి కుమ్మరి నరేష్ పరుశరాములకు అందజేయడంతో వారు తేజేశ్వర్ గల బైకుకు అమర్చారన్నారు. ముందుగా అనుకున్న పథకం ప్రకారం గా పొలం సర్వే చేయాలని తేజేశ్వర్ ను ఒక కారులో కర్నూల్ వైపు తీసుకుని వెళ్లి తిరిగి యూటర్న్ తీసుకొని గద్వాల వైపు వస్తుండగా దారి మధ్యలో వేట కొడవండ్ల హత్య చేసి బ్యాంక్ మేనేజర్ కు సమాచారాన్ని అందజేశారు. క్రమంలో డెడ్ బాడీని తీసుకుని పంచలింగాల దగ్గర్లోని తీసుకొని రావాలని సూచించడంతో అక్కడికి తీసుకుని వెళ్లగా తేజేశ్వర్ కు సంబంధించిన వస్తువులను పక్కన గల నదిలో పడేశారు.
అనంతరం కర్నూలు జిల్లా పాణ్యం ఘాట్ రోడ్డులో సుగానిమిట్ట దగ్గర నిర్మిస్తున్న కాలువ జమ్ములో తేజేశ్వర్ డెడ్ బాడీని పడేసి తిరిగి కర్నూలు చేరుకున్నారన్నారు. ముందుగా అనుకున్న ప్రకారం గా ఆ ముగ్గురికి బ్యాంక్ మేనేజర్ 2 లక్షల రూపాయల నగదును అందజేసినట్లు తెలిసింది. తేజేశ్వర్ తమ్ముడు ఇచ్చిన ఫిర్యాదును ఛాలెంజింగ్ గా తీసుకొని డిఎస్పి మొగులయ్య సిఐ టంగుటూరి శీను సాంకేతికతను ఉపయోగించి ప్రత్యేక బృందాలుగా ఏర్పడి విచారణ ప్రారంభించడం జరిగిందన్నారు.
గురువారం ఉదయం పుల్లూరు చెక్ పోస్ట్ దగ్గర వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా బ్యాంక్ మేనేజర్ తిరుమలరావు, కుమ్మరి నగేష్, పరుష రాముడు, చాకలి రాజు లు హైదరాబాదుకు పారిపోతుండగా అరెస్టు చేసి తమదైన శైలిలో విచారించగా చేసిన నేరని ఒప్పుకోవడం జరిగిందన్నారు. హత్యకు సహకరించిన ఐశ్వర్య ను గద్వాలలో, మేస్త్రి మోహన్ ను జమ్మిచెడు లో, తిరుపతయ్య, ఐశ్వర్య తల్లి సుజాత లను కర్నూల్ లోని వాళ్ల నివాస గృహంలో అరెస్టు చేసి వారి నుండి రెండు వేట కొడవళ్ళు ఒక కత్తి 10 మొబైల్ ఫోన్లు నగదును స్వాధీనం చేసుకుని వారిపై కేసు నమోదు చేయడం జరిగిందన్నారు. అనంతరం వారిని జిల్లా కోర్టు మందు ప్రవేశపరిచి రిమాండ్ కు తరలించడం జరిగిందన్నారు.
పోలీసులను అభినందించిన జిల్లా ఎస్పీ
రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేసును అతి తక్కువ సమయంలో ఛేదించడం లో ప్రతిభ చూపిన గద్వాల పట్టణ ఎస్సై కళ్యాణ్ కుమార్, రూరల్ ఎస్సై శ్రీకాంత్, ధరూర్ ఎస్సై కొండా శ్రీ హరి, మల్దకల్ ఎస్సై నందికర్, గట్టు ఎస్సై మల్లేష్, ఐటీ సెల్ ఎస్సై షుకూర్, పి.ఎస్సైలు స్వాతి, తేజేశ్విని, సిబ్బంది చంద్రయ్య, రాజు యాదవ్, రామకృష్ణ, కిరణ్ కుమార్, వీరేశ్,రవి కుమార్, కార్తీక్లను జిల్లా ఎస్పీ టి.శ్రీనివాస రావు క్యాష్ రివార్డ్ తో ప్రత్యేకంగా అభినంధించారు.