25 August, 2026 | 5:00 PM

నార్సింగి జంట హత్యల కేసును ఛేదించిన పోలీసులు

16-01-2025 04:50 PM

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా నార్సింగి కలకలం రేపిన జంట హత్యల కేసును పోలీసులు గురువారం చేధించారు. జంట హత్యలు చేసిన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు ఇద్దరిని చంపి మధ్యప్రదేశ్(Madhya Pradesh) పారిపోయాడు. వివాహేతర సంబంధం కారణంగానే ఇద్దరిని హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. పుప్పాలగూడలోని స్టోన్ క్రషర్(Puppalguda Stone crusher) సమీపంలో రెండు గుర్తుతెలియని మృతదేహాలు ఉన్నట్లు సమాచారం అందుకున్న ఒక రోజు తర్వాత, నార్సింగి పోలీసులు(Narsingi Police) బుధవారం డిసిపి సిహెచ్ శ్రీనివాస్ నేతృత్వంలోని శోధన బృందాలను పంపారు. జంట హత్యల కేసులో నిందితుడిని పట్టుకునేందుకు. విచారణ అధికారి హరికృష్ణా రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మృతులు మధ్యప్రదేశ్‌కు చెందిన అంకిత్ సాకేత్ (25), నగరంలో హౌస్‌కీపర్‌గా పనిచేస్తుండగా, ఛత్తీస్‌గఢ్‌కు చెందిన బిందు (25)గా గుర్తించారు. ఇద్దరూ లివ్ ఇన్ రిలేషన్ షిప్(Live-in Relationship)లో ఉన్నారు. ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీ(Osmania Hospital Mortuary)కి తరలించారు. బిందుకి పెళ్లై ముగ్గురు పిల్లలున్నారు. అంకిత్‌తో కలిసి జీవించేందుకు ఆమె హైదరాబాద్‌కు వచ్చింది.