9 May, 2026 | 11:24 AM

Breaking News

కరీంనగర్ బంద్ ప్రశాంతం   •   పశ్చిమ బెంగాల్ సీఎం ప్రమాణస్వీకారం.. పాల్గొన్న ప్రధాని మోదీ   •   ఒంగోలులో భూకంపం.. భయపడ్డ జనం   •   కొత్త సీడీఎస్‌గా రాజా సుబ్రమణి నియామకం   •   నేవీ చీఫ్‌గా వైస్ అడ్మిర‌ల్ కృష్ణస్వామినాథ‌న్ నియామ‌కం   •   గర్భం దాల్చిన మైనర్ బాలిక... యువకుడిపై కేసు నమోదు   •   కరీంనగర్‌లో టెన్షన్.. టెన్షన్.. మాజీమంత్రి గంగుల హౌస్ అరెస్ట్   •   తమిళనాడులో పొలిటికల్ సస్పెన్స్ థ్రిల్లర్.. అధికారానికి అడుగు దూరంలో విజయ్!   •   నామకరణ మహోత్సవంలో పాల్గొన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్   •   ట్రిపుల్ ICG ఫ్లోరెసెన్స్ సాంకేతికతతో రోబోటిక్ ఈసోఫేజియల్ క్యాన్సర్ శస్త్రచికిత్సలో ప్రపంచస్థాయి ప్రమాణాన్ని నెలకొల్పిన హైదరాబాద్ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ (AOI)   •  

నార్సింగి జంట హత్యల కేసును ఛేదించిన పోలీసులు

16-01-2025 04:50 PM

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా నార్సింగి కలకలం రేపిన జంట హత్యల కేసును పోలీసులు గురువారం చేధించారు. జంట హత్యలు చేసిన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు ఇద్దరిని చంపి మధ్యప్రదేశ్(Madhya Pradesh) పారిపోయాడు. వివాహేతర సంబంధం కారణంగానే ఇద్దరిని హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. పుప్పాలగూడలోని స్టోన్ క్రషర్(Puppalguda Stone crusher) సమీపంలో రెండు గుర్తుతెలియని మృతదేహాలు ఉన్నట్లు సమాచారం అందుకున్న ఒక రోజు తర్వాత, నార్సింగి పోలీసులు(Narsingi Police) బుధవారం డిసిపి సిహెచ్ శ్రీనివాస్ నేతృత్వంలోని శోధన బృందాలను పంపారు. జంట హత్యల కేసులో నిందితుడిని పట్టుకునేందుకు. విచారణ అధికారి హరికృష్ణా రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మృతులు మధ్యప్రదేశ్‌కు చెందిన అంకిత్ సాకేత్ (25), నగరంలో హౌస్‌కీపర్‌గా పనిచేస్తుండగా, ఛత్తీస్‌గఢ్‌కు చెందిన బిందు (25)గా గుర్తించారు. ఇద్దరూ లివ్ ఇన్ రిలేషన్ షిప్(Live-in Relationship)లో ఉన్నారు. ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీ(Osmania Hospital Mortuary)కి తరలించారు. బిందుకి పెళ్లై ముగ్గురు పిల్లలున్నారు. అంకిత్‌తో కలిసి జీవించేందుకు ఆమె హైదరాబాద్‌కు వచ్చింది.