17 April, 2026 | 11:22 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

తప్పతాగిన వ్యక్తిపై పోలీసుల తన్నులు

26-03-2025 08:30 PM

కళ్ళు దుకాణంలో విరంగం సృష్టిస్తున్నారని యజమాని ఫిర్యాదు..

కానిస్టేబుల్ హోంగార్డు చేయి చేసుకోవడంతో సస్పెన్షన్ వేటు...

కామారెడ్డి (విజయక్రాంతి): కల్లు దుకాణంలో తప్ప తాగి వీరంగం సృష్టిస్తున్న ఓ వ్యక్తిని ఇద్దరు పోలీసులు విధి నిర్వహణలో ప్రవర్తించిన తీరుపై జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర సస్పెన్షన్ వేటు వేశారు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా బాన్సువాడలో బుధవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. బాన్సువాడ పట్టణంలోని హారిజనవాడలో గొల్ల శీను అక్కడే నివాసం ఉంటున్నాడు. తాగుడుకు అలవాటు పడిన శీను... సమీపంలోని కల్లు దుకాణంలో కల్లు సేవించి వీరంగం సృష్టించారు.

కల్లు దుకాణం యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కానిస్టేబుల్ కిరణ్ హోంగార్డు గంగాధర్ సంఘటన స్థలానికి వచ్చారు. పోలీసులను చూసిన శీను కల్లు సీసాతో తలపై బాదుకున్నాడు. తలకు గాయమై రక్తం వస్తుండగా పోలీసులు అతనిని సముదాయించే ప్రయత్నం చేయకుండా వారి వద్ద ఉన్న లాఠీలకు పని చెప్పారు. గొల్ల శీనును చితకబాధారు. ఈ సంఘటన వీడియో వైరల్ కావడంతో జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ విషయం ఎస్పీ రాజేష్ చంద్ర దృష్టికి వెళ్లడంతో వెంటనే కానిస్టేబుల్ కిరణ్ హోంగార్డు గంగాధర్ లను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.