18 July, 2026 | 12:48 PM

Breaking News

సైబరాబాద్‌వ్యాప్తంగా ఫుట్‌పాత్ ఆక్రమణల తొలగింపు   •   Skyroot Vikram-1 విజయవంతం.. దేశ రోదసీ చరిత్రలో సరికొత్త అధ్యాయం   •   విక్రమ్-1 రాకెట్ ప్రయోగం వాయిదా   •   పైకప్పు కారుతోంది.. ప్లాస్టిక్ పట్టాలే దిక్కు!   •   వాతావరణ మార్పు అనేది దూరపు ముప్పు కాదు, సజీవ వాస్తవం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి   •   సబితా ఇంద్రారెడ్డి, RS ప్రవీణ్ కుమార్ హౌస్ అరెస్ట్   •   బండ రామారం పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తాం   •   బీఆర్ఎస్‌ యువ సంగ్రామ సభ.. ఎక్కడికక్కడే పోలీసుల అరెస్ట్‌లు   •   Sonam Wangchuk: వాంగ్‌చుక్ దీక్షకు బ్రేక్.. కేంద్రంపై పవార్ విమర్శలు   •   చారిత్రక జామా మసీదు విస్తరణకు శంకుస్థాపన   •  

27 నుంచి పాలిసెట్ కౌన్సెలింగ్

19-05-2026 12:00 AM

జూన్ 9 నుంచి తరగతులు ప్రారంభం

హైదరాబాద్, మే 18 (విజయక్రాంతి): ఈనెల 27 నుంచి పాలిసెట్ కౌన్సిలింగ్ ప్రారంభం కానుంది. ఈమేరకు సోమవారం పాలిసెట్ షెడ్యూల్‌ను అధికారులు విడుదల చేశారు. 27 నుంచి 31 వరకు దరఖాస్తు చేసుకోవాలని, సర్టిఫికేట్ వెరిఫికేషన్ 29 నుంచి జూన్ 1 వరకు, జూన్ 6 వరకు సీట్లు కేటాయిస్తామని తెలిపారు. సీటు పొందిన అభ్యర్థులు జూన్ 9 వరకు కాలేజీల్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని సూచించారు. 9 నుంచి తరగతులు ప్రారంభమవుతాయన్నారు. తుది విడత కౌన్సిలింగ్ జూన్ 15 నుంచి ప్రారంభం కానుంది. జూలై 1న స్పాట్ అడ్మిషన్లను చేపట్టనున్నారు.