calender_icon.png 27 June, 2025 | 11:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పడకేసిన పారిశుద్ధ్యం!

27-06-2025 01:37:35 AM

  1. ఆర్థిక భారంతో అభివృద్ధికి దూరంగా పల్లెలు
  2. తాగునీరు, వీధిలైట్లు, డ్రైనేజీ సమస్యలతో అతలాకుతలం
  3. నేడు పంచాయతీ రాజ్ మంత్రి సీతక్క పర్యటన
  4. సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి

చర్ల జూన్ 26 (విజయ క్రాంతి) పడకేసిన పంచాయతీల పారిశుద్ధ్యం, ఆర్థిక భారంతో ఆమడు దూరంలో అభివృద్ధి. తాగునీరు వీ ధి దీపాలు,  పారిశుద్ధ్యం సమస్యలతో పల్లెజనం అతలాకుతలం. ఏ సమస్యను ప్రశ్నిం చిన ఆర్థిక భారం అనే సమాధానంతో పం చాయతీ కార్యదర్శులు దాటా వేస్తున్న వైనం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని 27 పంచాయితీల్లో ఇదే తరహా సమ స్యలు ఉత్పన్నమవుతున్నాయి.

స్థానిక సంస్థలకు ఎన్నికలు లేకపోవడం, గ్రామ ప్రథమ పౌరుడి పదవి కాలం చాలా కాలంగా ఖా ళీగా ఉండటం, పంచాయతీల ప్రత్యేక అధికారుల పాలనలో పర్యవేక్షణ లేని కొట్టొచ్చిన ట్లు కనిపించడం వెరసి ప్రజలకు సమస్యలే మిగిలాయి. పాలకవర్గం లేకపోవడంతో కేంద్ర ప్రభుత్వ నిధులు మంజూరు కాకపోవడం, కేవలం ఇంటి పన్ను ఆదాయం పైనే పంచాయితీల నిర్వహణ పడింది. చర్ల మం డలంలో ఇంటి పన్నుల, సంత పాటల లెక్కలపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి.

పంచాయతీ కార్యదర్శులు వాటి లెక్కలను పారదర్శకంగా నిర్వర్తించడం లేదని ఆరోపణలు వెలువడుతున్నాయి. వచ్చే ఆదాయ వనరుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం, పంచాయతీలకు నిధులు రాకపోవడంతో అభివృద్ధి, పారిశుద్ధ్యం పడకేస్తున్నాయి. గత ఏడాదిన్నరగా చర్ల మండలంలో దోమల నివారణ చర్యలు చేపట్టకపోవడంతో ప్రజ లు మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్ జ్వరాల బారినపడి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. శుద్ధమైన తాగునీరు సరఫరా సక్రమంగా లేకపోవడంతో ప్రజలు తాగు నొప్పికి తహతహలాడుతున్నారు.

వెచ్చలవిడిగా గోదావరిలో ఇసుక తోడకాలు చేపట్టడం వల్ల భూగర్భ జలాలు అడుగంటి చేతిపంపుల్లో నీళ్లు రా కుండా పోతున్నాయి. కేవలం మిషన్ భగీరథ పైపులైన్ల మీదనే ఆధారపడటంతో, మం డలంలోని ప్రతి గ్రామంలో తాగునీటి సమ స్య తాండవిస్తోంది. చర్ల మండల కేంద్రంలో రోడ్లపైనే పశువులు పందులు కుక్కల సంచారం విచ్చలవిడగా సాగుతోంది వాటిని నియంత్రణ లో పంచాయతీ సిబ్బంది పూర్తి గా విఫలమైతున్నారని విమర్శలు వెలబడుతున్నాయి. పలు సందర్భాల్లో ప్రమాదాల గురై ఆసుపత్రి పాలవుతున్నారు.

నడిరోడ్లపైనే ఇబ్బడి ముబ్బడిగా మాంసపు దుకా ణాలు వెలువడటంతో ఒకవైపు దుర్గ ంధం, మరోవైపు కుక్కల స్త్వ్రర విహారం ప్రజలను ఇబ్బందికి గురిచేస్తుంది. వాటిని నియంత్రించడంలోనూ పంచాయతీ సిబ్బం ది చేతివాటానికి అలవాటు పడ్డారనే ఆరోపణలు లేకపోలేదు. పంచాయతీ అభివృ ద్ధిలకు నిధులు మంజూరు చేసి ప్రజా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. 

నేడు మండలంలో మంత్రి సీతక్క పర్యటన 

చర్ల మండలంలో గిరిజన మాత శిశు సం క్షేమ, పంచాయతీరాజ్ మంత్రి సీతక్క పర్యటించనున్నారు. మండలంలోని గుంపెనగు డంలో నూతనంగా నిర్మించిన పెట్రోల్ బం కు, లక్ష్మీ కాలనీలో నిర్మించిన నూతన పంచాయతీ భవనాన్ని ఆమె ప్రారంభించనున్నా రు.ఇందిరమ్మ ఇళ్ల పట్టాలను పలు గ్రామా ల్లో లబ్ధిదారులకు అందించనున్నారు.