25-07-2025 05:47:31 PM
ముగ్గురు హెచ్సీ లకు ఏఎస్ఐ గా పదోన్నతి
మహబూబాబాద్,(విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లాలో హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న ముగ్గురికి ఏఎస్సై లుగా పదోన్నతి లభించింది. కేసముద్రం పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న ఆర్. సదయ్య, మహబూబాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న జీ.కృష్ణ నాయక్, స్పెషల్ బ్రాంచ్ విభాగంలో హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న టి. కుమారస్వామి లకు ఏఎస్ఐలుగా పదోన్నతి లభించింది. పదోన్నతి లభించిన ఏఎస్ఐలను జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ అభినందించారు. వృత్తినిబద్ధతతో పనిచేసి పోలీసు శాఖకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.