23 May, 2026 | 2:28 PM

Breaking News

నేరెళ్ళ బాలికల గురుకులంలో బోధనా సిబ్బంది నియామకాలకు దరఖాస్తుల ఆహ్వానం   •   ఇచ్చిన మాట నిలబెట్టుకున్న తంగళ్ళపల్లి సర్పంచ్   •   వినియోగదారులకు చేరువగా టీజీఎన్పీడీడీసీఎల్ యాప్   •   మండుతున్న ఎండలకు నిర్మానుష్యంగా దమ్మపేట మెయిన్ రోడ్డు   •   పుణ్య నాయక్ తాండ చింతలపూడి మధ్య వాగుపై వంతెన నిర్మించండి   •   రైతుల సమస్యలపై ఎమ్మార్వో కార్యాలయం ఎదుట బీజేపీ నిరసన   •   జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన డీసీసీ అధ్యక్షులు   •   నూతన అభివృద్ధి కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం   •   సహకార సంఘం ఎదుట జొన్న రైతుల నిరసన   •   తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను 30 నెలలైనా నెరవేర్చలేదు   •  

ఎరువుల దుకాణాలు తనిఖీ

25-07-2025 05:44 PM

హాజీపూర్,(విజయక్రాంతి): జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశాల మేరకు శుక్రవారం హాజీపూర్ మండల కేంద్రంలోని ఎరువుల దుకాణాలను మండల స్థాయి టాస్క్ ఫోర్స్ టీం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎరువులు, యూరియా అమ్మే డీలర్ దుకాణాలను తనిఖీ చేశారు. గోదాములలో యూరియా బస్తాల నిల్వలు, స్టాక్ రిజిస్టర్, ఈపాస్ మెషీన్ లో అమ్మకాల వివరాలు పరిశీలించారు. రైతు ఆదార్ కార్డుతో ఈపాస్ మెషీన్ లో నమోదు చేసి, యూరియానీ విక్రయించాలని, పంట విస్తీర్ణం ప్రకారం మాత్రమే యూరియా రైతులకి ఇవ్వాలనీ, యూరియా, డిఏపికి బదులుగా తక్కువ ఖర్చులో ఉన్న  ద్రవ యూరియా, ద్రవ డీ ఏ పీ ని రైతులు వాడే విధంగా అవగాహన కల్పించాలని కోరారు. మండల స్థాయి టాస్క్ ఫోర్స్ టీంలో మండల వ్యవసాయ అధికారి కృష్ణ, తహసిల్దార్ శ్రీనివాస్ దేశ్ పాండే, ఎస్సై అమృత్ రాజ్ సిబ్బంది తదితరులు ఉన్నారు.