28-06-2025 10:45:30 PM
దౌల్తాబాద్,(విజయక్రాంతి): దౌల్తాబాద్, రాయపోల్ మండలాల్లోని అన్ని గ్రామాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని తుక్కాపూర్ ఏడిఈ శ్రీనివాసరావు శనివారం పేర్కొన్నారు. 132 కెవి, 33 కెవి,11 కెవి దౌల్తాబాద్, రాయపోల్, ముబారస్పూర్, గుర్రాల సోఫా సబ్ స్టేషన్ లో ఫీడర్ మరమ్మతులతో ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు సరఫరాలో అంతరాయం ఉంటుందన్నారు. విద్యుత్ అంతరాయానికి గ్రామాల ప్రజలు, విద్యుత్ వినియోగదారులు సహకరించాలని ఆయన తెలిపారు.