భారత్ 5-0 ఇంగ్లండ్

30-04-2024 12:54:27 AM

థామస్ కప్  

చెంగ్డూ (చైనా): ఒలింపిక్స్‌కు ముందు భారత షట్లర్లు అదరగొడుతున్నారు. ఉబెర్ కప్‌లో ఇప్పటికే మహిళల జట్టు క్వార్టర్స్‌లో అడుగుపెట్టగా.. థామస్‌కప్‌లో పురుషుల జట్టు కూడా అదే బాటలో నడిచింది. గ్రూప్ భాగంగా సోమవారం జరిగిన పోరులో భారత్ 5 ఇంగ్లండ్‌ను చిత్తు చేసి క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టింది. తొలి సింగిల్స్‌లో హెచ్‌ఎస్ ప్రణయ్ 21 21 హ్యారీ హుయాంగ్‌ను ఓడించి భారత్‌కు శుభారంభం అందించాడు. అనంతరం డబుల్స్ మ్యాచ్‌లో సాత్విక్ సాయిరాజ్ శెట్టి ద్వయం 21 19 21 బెన్ లానే\ సీన్ వెండీ జంటను చిత్తు చేసింది. రెండో సింగిల్స్ పోరులో తెలుగు షట్లర్ శ్రీకాంత్ 21 21 నదీమ్ దల్వీపై అలవోక విజయాన్ని నమోదు చేసి జట్టును గెలిపించాడు. నామమాత్రమైన రెండో డబుల్స్‌లో అర్జున్ జోడీ 21 21 రోరీ ఈస్టన్ గ్రీన్ జంటపై నెగ్గింది. ఇక చివరి సింగిల్స్‌లో కిరణ్ జార్జ్ 21 21 చోలన్ కాయన్‌పై విక్టరీ సాధించడంతో భారత్ 5 ‘టై’ను ముగించింది. గ్రూప్ భాగంగా బుధవారం జరగనున్న ఆఖరి లీగ్ మ్యాచ్‌లో 14 సార్లు చాంపియన్ ఇండోనేషియాతో భారత్ తలపడనుంది.