12-12-2025 12:44:44 AM
హైదరాబాద్, డిసెంబర్ 11 (విజయక్రాంతి): శీతాకాల విడిదిలో భాగంగా రాష్ర్ట పతి ద్రౌపది ముర్ము ఈ నెల 17 నుంచి 21 వరకు హైదరాబాద్లోని రాష్ర్టపతి నిలయంలో బస చేస్తారని ప్రభుత్వ ప్రధాన కా ర్యదర్శి కే రామకృష్ణారావు తెలిపారు. ఐదు రోజుల రాష్ర్టపతి పర్యటన నేపథ్యంలో చేపట్టాల్సిన ఏర్పాట్లపై గురువారం సచివాలయంలో ఉన్నతాధికారులతో సమీక్షించా రు. రాష్ర్టపతి పర్యటనకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
కేంద్ర ప్రభుత్వ విభాగాలు, రాష్ర్ట ప్రభుత్వ అధికారులు, రాష్ర్టపతి నిలయం అధికారులు సమ న్వయంతో ఏర్పాట్లు చేయాలని సూచించా రు. రాష్ర్టపతి నిలయంలో 24 గంటలు స్నేక్ క్యాచర్ బృందాన్ని అందుబాటులో ఉంచాలని, పరిసరాల్లో కోతుల బెడదను ఎదు ర్కొనేందుకు ప్రత్యేక బృందాలను నియమించాలని, తేనెటీగలను పట్టుకోవానికి ముం దుస్తు ఏర్పాట్లు చేయాలని జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించారు.
సమీక్షలో డీజీపీ శివధర్రెడ్డి, రోడ్లు భవనాల శాఖ ప్రతే ్యక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్, హోం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సీవీ ఆనంద్, హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్, ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్, పొలిటికల్ కార్యదర్శి ఈ శ్రీధర్, అదనపు డీజీ పీలు మహేశ్ భగవత్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, అగ్నిమాపక శాఖ డీజీ విక్ర మ్ సింగ్ మాన్, సమాచార పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ సీహెచ్ ప్రి యాంక, ప్రొటోకాల్ డైరెక్టర్ శివలింగయ్య తదితరులు పాల్గొన్నారు.