13-06-2025 02:32:38 AM
తాడ్వాయి,జూన్12(విజయక్రాంతి): ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారంలో మంత్రి సీతక్క శ్రీసమ్మక్క సారలమ్మ తల్లులను దర్శించుకున్నారు అనంతరం ఒక కోటి 98లక్షలతో నిర్మించిన శ్రీసమ్మక్క సారలమ్మ జాతర,మేడారం పూజారుల అతిథి గృహ సముదాయ భవనంను గురువారం రాష్ట్ర పంచాయితి రాజ్,గ్రామీణ అభివృద్ధి,గ్రామీణ నీటి సరఫరా,మహిళా,శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క,అదనపు కలెక్టర్ రెవిన్యూ సిహెచ్ మహేందర్ జి,గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవి చందర్ లతో కలిసి ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో పూజారుల సంఘం అధ్యక్షులు సిద్దబోయిన జగ్గారావు,ఈఓ మేడారం యం.వీరస్వామి,ఓఎస్డి రవీందర్,పూజారులు,ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.