14-06-2025 12:07:03 AM
కొత్తకోట జూన్ 13 : ఇండ్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తూ సొంతింటి కలను కాంగ్రెస్ ప్రభు త్వం నిజం చేస్తుందని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అన్నారు. శుక్రవారం కొత్తకోట మండలం మిరాసిపల్లి గ్రామం లో రెవిన్యూ భూ భారతి సదస్సు, సీసీ రోడ్, వడ్డెర కమ్యూని టీ హాల్, కుర్వ సంఘం కమ్యూనిటీ హాల్ కాంపౌండ్ వాల్ ని ర్మాణానికి, అలాగే ఇందిరమ్మ ఇంటికి భూమిపూజా చేశారు.
అదేవిదంగా కొత్తకోట మున్సిపాలిటీ కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం సమీపంలో 30 పడకల హాస్పిటల్ కోసం శంకుస్థాపన చేశారు. అనంతరం బిపిఆర్ గార్డెన్ లో మండలంలోని ఆయా గ్రామాలకు సంబదించిన ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్స్ పత్రాలను అందజేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భూ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించాలనే ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తీసుకువచ్చిందని అన్నారు.
భూ సమస్య ఏదైనా ఉంటే గ్రామంలోకి వ చ్చిన అధికారులకు దరఖాస్తు చేసుకోవాలని.. రెవెన్యూ సదస్సులో మీరు ఇచ్చిన దరఖాస్తులను పరిశీలించి, సమస్యను అధికారులు పరిష్కరిస్తారన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ నెలకొల్పిన ఆరుపడకల ఆసుపత్రిలోనే ఇప్పటికీ ప్రజలకు వైద్య సేవలు అందుతున్నాయని, నేడు 30 పడకల ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేసుకున్నామని, ఆనతి కాలంలోనే హాస్పటల్ నిర్మాణాన్ని పూర్తి చేయించి, ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని పేర్కొన్నారు.
కొత్తకోట మండ లంలో నేటికీ సుమారు 600 ఇండ్లు మంజూరు అయ్యాయని వాటికీ సంబందించిన ప్రొసీడింగ్స్ పత్రాలు అందజేశామని చెప్పారు. ప్రతి లబ్ధిదారునికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి వారి కలను నెరవేరుస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పల్లెపాగు ప్రశాంత్, తహసీల్దార్ వెంకటేశ్వర్లు, ఎంపీడీఓ కృష్ణయ్య, కాంగ్రెస్ మండల అధ్యక్షులు బిచుపల్లి, మాజీ జడ్పీటీసీ బాబు, చర్లపల్లి శేఖర్ రెడ్డి, నరేందర్ రెడ్డి, బోయోజ్, రావుల కర్ణాకర్ రెడ్డి, మేస్త్రి శ్రీను, సాయి రెడ్డి, మి షేక్, సుభాష్, అమ్మపల్లి బాలకృష్ణ, పెంటన్న యాదవ్, రా ములు యాదవ్, డబ్బ సలీం, శ్రీకాంత్, సంద వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.