11-02-2026 06:53:15 PM
సిర్గాపూర్,(విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండల పరిధిలోని కడ్పల్ గ్రామంలో బుధవారం నాడు గోపాల కాలా మహోత్సవం ఘనంగా జరిగింది. ఇందులో గ్రామానికి చెందిన మహిళలు నిండు కలశాలు, మంగళ హారతులతో ఊరేగింపు నిర్వహించారు. స్థానిక దాసాంజనేయ స్వామి ఆలయం తృతీయ వార్షికోత్సవాల వేడుకలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా అఖండ హరినామ సప్తహం కార్యక్రమంలోని గోపాల కాలా భార్గవి సాంప్రదాయ భజనలతో స్వామివారి పల్లకి సేవ, శోభాయాత్ర ఊరేగింపు నిర్వహించి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, భజన భక్తులు, మహిళలు, యువకులు గ్రామస్థులు, గ్రామ ఆడ బిడ్డలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.