calender_icon.png 30 May, 2025 | 1:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రైవేట్ ల్యాబులు వైద్యశాలల దోపిడీ నుంచి గిరిజనులు కాపాడండి

27-05-2025 12:00:00 AM

వైద్యశాఖ అధికారులను ఆదేశించిన ఐటీడీఏ పీవోరాహుల్

భద్రాచలం, మే 26(విజయక్రాంతి): మా రుమూల ఆదివాసి గిరిజన గ్రామాల నుంచి భద్రాచలం ఏరియా ఆసుపత్రికి వచ్చే రోగులకు వివిధ టెస్టులు, స్కానింగ్, ఎక్సరేలు తీ యించుకోవడానికి ప్రైవేట్ ల్యాబ్‌లకు పంపిం చడం వల్ల అర్హత లేని ల్యాబ్ అసిస్టెంట్లతో టెస్టులు చేయించి అధిక ధరలు వసూలు చేస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి రాహుల్ అన్నారు.

సోమవారం ఐటీడీఏ సమావేశం మందిరంలో భద్రాచలంలోని ప్రైవేట్ డాక్టర్ల, ల్యాబ్ అసిస్టెంట్లతో ఆయ న ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏజెన్సీ ఏరియా లోని మార్మూల ఆదివాసి గిరిజన గ్రామాల నుం డి ఎక్కువ శాతం నిరుపేదలైన గిరిజనులు ఏరియా ఆసుపత్రికి వస్తూ ఉంటారని, వారి కి వివిధ రకాల టెస్టుల కోసం ప్రైవేట్ ల్యాబ్ లకు వస్తే వారి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని అర్హత లేని ల్యాబ్ అసిస్టెంట్లకు వివి ధ రకాల టెస్టులు చేసి అధిక ధరలు వసూ లు చేస్తున్నట్లు తెలిసిందన్నారు.

అందుకు ప్రైవేట్ ల్యాబ్ లు నిర్వహించేవారు గిరిజను ల నుండి మినిమం ఛార్జీలను మాత్రమే వ సూలు చేయాలని,అలాగే వివిధ రకాల టెస్టులకు, ఐసీయూలో బెడ్ చార్జెస్, ఇతర రకాల టెస్టులకు సంబంధించిన బోర్డులు ఏ టెస్ట్ కి ఎంత చార్జీ వసూలు చేస్తారో రేట్ల ప్రకారం ల్యాబ్ ముందు డిస్ప్లే చేయాలని ఆదేశించా రు. అర్హత కలిగిన ల్యాబ్ అసిస్టెంట్లు మా త్రమే టెస్టులు నిర్వహించేలా చూడాలన్నా రు.

ప్రైవేట్ ఆసుపత్రి నిర్వహించే డాక్టర్లు బ యో మెడికల్ వేస్ట్ మేటీరియల్ ప్రతిదీ డం పింగ్ యార్డులలో వేస్తున్నారని ఇకముందు అలా జరగకుండా చూడాలన్నారు. త్వరలో గ్రామపంచాయతీ అధికారులు, వైద్య శాఖ అధికారులతో ఒక బృందాన్ని సర్వే చేయడానికి నియమిస్తున్నామన్నారు.

ప్రతి ఒక్కరు బయో మెడికల్ వేస్టేజ్ ని ఇష్టం వచ్చినట్టు ఎక్కడబడితే అక్కడ వేయకుండా చూడాలని, నిబంధనలు అతిక్రమించిన డాక్టర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.. ప్రతివారం నర్సింగ్ పూర్తిచేసిన బాలికలు జీవనోపాధి కల్పించడానికి దరఖాస్తులు పె ట్టుకుంటున్నారని అర్హత ఉన్నవారికి మీ ఆ సుపత్రులలో నియమించి వారికి జీవన భృతి కల్పించాలని ,ముఖ్యంగా పి వి టి జి గ్రామాలలో నర్సింగ్ శిక్షణ తీసుకున్న విద్యార్థులు ఉన్నారని, తప్పకుండా ప్రైవేట్ డాక్టర్లు వారికి జీవనోపాధి కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు.

ప్రభుత్వ , ప్రైవేటు ఆస్పత్రికి డెలివరీకి వచ్చే గర్భిణీలు కానీ పేషెంట్లు కానీ డాక్టర్లు చెప్పిందే వింటారని వారికి అర్థమ య్యే రీతిలో తగిన సూచనలు సలహాలు ఇ చ్చి గర్భిణీలకు నార్మల్ డెలివరీ అయ్యేలా చూడాలన్నారు. ప్రస్తుతం భద్రాచలంలో 14 మంది ఆర్‌ఎంపీ డాక్టర్లు పనిచేస్తున్నారని, చర్ల మండలంలో అధికంగా ఉన్నట్లు మా దృష్టికి వచ్చిందని, ఆర్‌ఎంపీ డాక్టర్లు వారి తహతకు మించి వైద్యం చేయకూడదని,

మీ దగ్గరకు వచ్చే గిరిజనుల వద్ద అధిక చార్జీలు వసూలు చేయకూడదని, నిబంధనలకు మించి అధిక చార్జీలు వసూలు చేసే ఆర్‌ఎం పీ డాక్టర్లపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు.ఈ కార్యక్రమంలో ఏడీఎం హెచ్వో డాక్టర్ చైతన్య, ఏరియా ఆసుపత్రి పర్యవేక్షకుడు రామకృష్ణ, ఐఎంఏ ప్రెసిడెంట్ డాక్టర్ సుదర్శన్, డాక్టర్ రమేష్ చంద్ర, డాక్టర్ స్పందన, ప్రోగ్రాం అధికారి రాము, ప్రైవేట్ ల్యాబ్ యూనియన్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.