27-05-2025 12:00:00 AM
సూర్యాపేట మే 26 (విజయక్రాంతి): ఉపాధ్యాయుల నైపుణ్యాలను పెంచుకునేందుకు ప్రభుత్వం వృత్యంతర శిక్షణ కార్యక్రమాలను ఏర్పాటు చేస్తుంది.
దానిలో భాగంగా ఉపాధ్యాయుల బోధనా ప్రమాణాలు మెరుగుపరుచుకోవడంతో పాటు, తరగతిలో వెనుకబడిన విద్యార్థుల సామర్ధ్యాలను పెంపొందించేందుకు జిల్లాలోని మోతే మండల కేంద్రంలో విద్యాశాఖ ఆధ్వర్యంలో మండలంలోని ఎస్జీటీ ఉపాధ్యాయులందరికీ ఐదు రోజులపాటు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.
అయితే ఈ శిక్షణ చివరి రో జైన శనివారం నిపుణులు చెబుతున్న అంశాలపై శిక్షణ పొందుతున్న పలువురు ఉపాధ్యా యులు మనసు పెట్టకుండా తన చేతిలో ఉ న్న మొబైల్పై దృష్టి పెట్టి అందులోని ఫోటో లు, వీడియోలను వీక్షించారు.
సమాజాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయులు తరగతి గదిలో మొబైల్ ఫోన్ ఉపయోగించకూడదని నిబంధన ఉన్నప్పటికీ, ఇలా శిక్షణ సమయంలో మొబైల్ వీక్షణ చేయడం ఏంటి అని పలువురు ప్రశ్నిస్తున్నారు.