26-06-2025 12:25:34 AM
ఎమ్మెల్యే కాలె యాదయ్య
చేవెళ్ల, జూన్ 25:విద్యార్థులకు నా ణ్యమైన విద్య అందించాలని చేవెళ్ల ఎ మ్మెల్యే కాలె యాదయ్య సూచించారు. బుధవారం చేవెళ్ల మున్సిపాలిటీ పరిధిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ఆకస్మి కంగా తనిఖీ చేశారు. కాలేజీలో కొత్తగా నిర్మిస్తున్న తరగతి గదులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.
వానాకాలం కావడంతో పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. అధ్యాపకులు తమ కాలేజీలో చేరాలని ప్రచారం నిర్వహించడం అభినం దనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ కాంచన లత, అధ్యాపకులుపాల్గొన్నారు.